పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

135

     తనిమాయ గానఁబడియెను.
     విన నచ్చెరు వనుచు నచటు వెలుపడి యంతన్.113
క. అలసినసింగముభంగిని
     దలరుచుఁ జని యొక్కశైలతటమునఁ దా ని
     శ్చలవృత్తిఁ దపము సేసెను
     దలఁపున హరి నిల్పి యధికతత్పరబుద్ధిన్.114
వ. ఇ ట్లత్యంతనిష్ఠాపరుండై తపంబు సేయుచుండఁ బెద్దకాలంబునకును.115
ఉ. శ్రీకరరత్నకుండలమరీచులబెళ్కులు చెక్కులొత్త, శో
     భాకరకౌస్తుభద్యుతి నుదంచిత మై వనమాల గ్రాల, ల
     క్ష్మీకరగంధసారరుచిచిహ్నితవక్షుఁడు చక్రి వచ్చె నా
     ళీకవిలోకనాంశులు దలిర్పఁగ గాధిమునీంద్రుపాలికిన్.116
వ. ఇట్లు ప్రత్యక్షం బై నకమలాక్షు నిరీక్షించి పునఃపువఃప్రణామంబులు
     సేసి నిటలతటఘటితాంజలి యై యి ట్లనియె.117
మత్తకోకిల. 'దేవ, దేవరమాయ నాకు నుదీర్ణ మై మదిఁ దోచె; ని
     ట్లే విచిత్రమొ చిత్తవిభ్రమ మీముహూర్తయుగంబునం
     దే విధంబునఁ బుట్టెనో చన నింతయున్ విశదింపవే.'
     నావుడున్ విని గాధి కంబుజనాభుఁ డి ట్లను సత్కృపన్.117
సీ. అనఘాత్మ భూమ్యాదు లరయఁ జిత్తమునంద
                    కాని యెన్నఁడు వెలిఁ గావు వినుము.
     మది విభ్రమస్వప్నమయముగా సర్వంబు
                    ననుభవింపఁగఁ జాలి తఖిలములను.
     ఇన్నియుఁ గల్పించు నీచిత్తమునకుఁ జం
                    డాలత్వ మనఁగ నేడది తలంప?
     శ్వపచత్వమునఁ దోఁచు విపరీత మె ట్ల య్యె