పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

వాసిష్ఠరామాయణము

వ. అంత.107
క. అదిరిపడి సూచి తొల్లిటి
     యుదకములోఁ దీర్థ మాడుచుండినవాఁ డై
     మది 'నాలుగుగడియలలో
     నిది యేదరి వచ్చెనొక్కొ, యిట నా' కనుచున్.108
గీ. అంత నావిప్రుఁ డుదకంబునందు వెడలి;౼
     యకట విభ్రాంతిచిత్తంబులందుఁ దవిలి
     యెల్లదేహుల భ్రమియించి యెందుఁ దిరుగుఁ
     బులి యుదగ్రత నడవుల మెలఁగునట్ల –109
వ. అని చిత్తమోహంబుం తిరస్కరించుచు, నిజాశ్రమంబునకు వచ్చి, తన
     మనంబున మెఱమెఱపడుచుండునంత. నొక్కనాఁడు కీరదేశంబుననుం
     డి యొక్క భూసురుం డతిథి యై చనుదెంచిన గాధి యతనింబూజించి
     యవ్విప్రువలనఁ గీరదేశవాసు లగుమనుష్య లొక్కుచండాలు సహ
     వాసదోషంబున కై సహకుటుంబులై యనలంబుం బ్రవేశించి రనిన
     విని, యంతయుఁ దనకృత్యంబ కా వగచి.110
ఉ. అచ్చటు చూడ వేడ్కపడి యాముని మార్గమునందు దేశముల్
     చెచ్చెరఁ బెక్కు దాఁటి చని చెన్నైసలారెడు హూణభూమిలో
     మచ్చిగఁ దాఁ జరించు పెనుమాలనిపల్లెయు నాలుబిడ్డలున్
     జచ్చినయిల్లుఁ గాంచి మది సంచలియింపఁగఁ గీరభూమికిన్.111
క. చని తన యేలినపురమును
     గనకాలయములను దనకుఁగా మంత్రులు గ
     జ్జములు సొద సొచ్చు నెడలును
     గనుగొని విధిసేఁత కడలి కళవళపడుచున్.112
క. తన యంతరంగమున నా
     వనజోదరుఁ డిచ్చినట్టివరమున నా కా