చతుర్థాశ్వాసము
133
గని, యాలుబిడ్డలు కాలగోచరు లైన,
విమలాత్ముఁ డై యిల్లు విడిచి, కీర
గీ. పురమునకు నేఁగ, నాప్రోలి ధరణివిభుఁడు
మరణ మొందిన, నా రాజుమంత్రు లొక్క
కరి నలంకార మొనరించి పురమునడుమ
విడుచుటయు, నది యంగళ్లు వెదకి వెదకి.102
క. గుండుకొని సూచుమానిసి
తండము తలగంగఁ ద్రోచి తత్కరి వెస నా
చండాలుఁ దెచ్చి భూజన
మండలి కభిషిక్తుఁ జేసె మంత్రులు సూడన్.103
ఉ. మాలఁడు వీడుఁ నా నెఱుకమాలినమంత్రులు తత్పురంపుభూ
పాలుసిరాజ్యసంపదకుఁ బట్టముగట్టిన, నాతఁడున్ నృప
శ్రీల రమించె, హేమమయచిత్రితహర్మ్యములం బ్రియాకటా
క్షాలసమందహాససురతామృతపానమదాంధబుద్ధి యై.104
వ. ఇవ్విధంబున నెనిమిది యేండ్లు రాజ్యసుఖంబు లనుభవించుచుండ;
నంత నొక్కనాఁ డాతనిబంధు వగుచండాలుఁడు హూణమండలంబున
నుండి చనుదెంచి యతనిచుట్టఱికంబుఁ దెలుప, నందఱు నెఱింగి, 'యక
టా! యీ చండాలసహవాసదోషంబునం బెద్ద కాలం బుండితి,
మింక నేమి సేయుద!' మని నివేదించి తత్పాపనిర్వాపణంబు సేయం
దలంచి మంత్రిపురోహితసామంతదండనాథసహితంబుగా ననలంబుం
బ్రవేశించిన.105
క. వారలు దనకతమున నతి
దారుణ మగునగ్నిశిఖల దగ్ధం బగుడున్
వారి నెడఁబాసి దుగఖము
కూరిన సొద సొచ్చె వెగడు గుడిచిన మదితోన్.106