పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

వాసిష్ఠరామాయణము

     వినునట్టి పుణ్యమతులకు
     మునుకొని దుఃఖములు డిందు మోక్షము చెందున్.96
వ. అని యిట్లు ప్రహ్లాదోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు మఱియు
     ని ట్లనియె.97

గాధ్యుపాఖ్యానము

క. విను రాఘవ సంసారం
     బనుపేరిటిమాయ కెందు నవసానము లే;
     దెనయఁగఁ దన చేతోజయ
     మునఁ గా కేమిటను బొలిసి పో దెన్నటికిన్.98
వ. అట్లు గావున జగంబుల మాయావైచిత్రిఁ దెలుపు మంటి. మున్ను
     లవణువృత్తాంతంబు సెప్పినట్లు, గాధి యనువిప్రువర్తనం బెఱింగించె
     ద. దత్పరబుద్ధి వై యాకర్ణింపుము.99
ఉ. పావనమూర్తి గాధి యనుబాడబుఁ డొక్కఁడు విష్ణుఁగూర్చి గో
     దావరినీటిలోకుల నుదగ్రతపం బొనరింప, నవ్విభుం
     'డేవర మైన నీకు దయ నిచ్చెదఁ, గొంకక వేఁడు వత్స' నా;
     నా వనుధామరుం డనియె; నంజలి యౌదలఁ జేర్చి మ్రొక్కుచున్.100
వ. 'దేవా, భవదీయ మాయ నిరీక్షింప నపేక్షించుచున్నవాఁడ. నీవరము
     ప్రసాదింపు;' మనిన, నట్ల కాక యని యప్పరమేశ్వరుం డంతర్ధానంబు
     నొందె. నంతఁ గొన్నిదినంబులను నొక్కనాఁ డమ్మహీసురవరుండు.101
సీ. స్నానంబు సేయుచు జలమధ్యమున గ్రుంకి
                    యఘమర్షణము సేయునపుడు చిత్త
     విస్మృతి వొడమిన, విప్రుండు వెగ డొంది
                    తగ నీటిలోఁ దన తనువు విడిచి,
     హూణదేశంబున నొకయూరఁ జండాల
                    భామకుఁ బుట్టి యపత్యసమితిఁ