పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

131

     తను వలఁపకు; వేగ లెమ్ము; తగ నీసింహా
     సన మెక్కు; రాజ్యలక్ష్మికి
     ఘనయశ నినుఁ బట్ట మేను గట్టదఁ బ్రీతిన్.91
వ. అని పలికి యతని నిఖలరాజ్యాభిషిక్తుం జేసి యాకల్పాంతస్థిరసౌఖ్యం
     బనుభవింపు; మని పుండరీకాక్షుం డంతర్ధానంబు నొందె ననిన
     విని రఘుకుంజరుం డమ్మునికుంజురున కి ట్లనియె.92
గీ. అనఘ యత్యంతపరిణామ మైనయట్టి
     యమ్మహాయోగివరునిచిత్తమ్ము దలఁప
     బాహ్యకల్పిత మైన యప్పాంచజన్య
     నినదమునఁ జేసి యెట్లు మేల్కనియెఁ జెపుమ.93
సీ. అనిన వసిష్ఠుఁ డిట్లను భ్రష్టబీజంబు
                    కరణి జన్మాంకురకారి గాక
     శుద్ధవాసన వొల్చుఁ జుమ్ము జీవన్ముక్తు
                    లగువారిహృదయంబులందు నెపుడు;
     నదియుఁ బావనియును నధికయు శుద్ధస
                    త్త్వానుసారియును నధ్యాత్మవతియు
     నిత్యప్రబుద్ధయు నియతయు సై సహ
                    స్రాబ్దాంతముల నైన నలరుచుండుఁ.
గీ. గణఁగి యవ్వాసనయు మేనఁ గలిగియుండుఁ,
     దాన యొకచోటఁ బొడసూపి యైన వారి
     దివ్యవిజ్ఞానమహిమ వర్ధిలఁగఁ జేయు
     రఘుకులోత్పలవనచంద్ర రామచంద్ర.94
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె.95
క. ఘనపుణ్యుఁ డైన ప్రహ్లా
     దునిశుభచరితంబు భక్తితోడ ముదితు లై.