పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

వాసిష్టరామాయణము

క. ఈవిధము నిశ్చయం బగు
     భావారూఢప్రబోధపరిణతబుద్ధిన్
     నీవ నినుఁ జూచుకొంచును
     భూవినుత యనంతపదముఁ బొందుము ప్రీతిన్.68
వ. అని చెప్పి శుక్రుడు దివంబునకుం జనియె. బలియును నీజగత్త్రిత
     యంబును జిన్మయంబకా మనంబునం దలంచి దృశ్యదర్శనవిము
     క్తుండును, కేవలజ్ఞానమయుండును, నూర్జితుండును, నిరాభాసుం
     డును, సకలజగద్ద్రష్టయు, పరమేశ్వరుండును, నగు నాత్మ నే నని చై
     త్యనిర్ముక్తచిద్రూపుండును, సర్వపూరకంబును, సర్వంబును, శమితస
     కలసంవేద్యంబును, సంవిన్మాత్రంబును, నగు తత్త్వంబు దానయై
     మఱియును.69
సీ. ఇది తలంచుచును గోవిదుఁ డగుబలి ప్రణ
                    వంబునం దర్ధమాత్రంబులోని
     యర్థంబు మనమున ననవరతధ్యాన
                    కలితుఁడై కర్మసంకల్ప మెడలి,
     జితచైత్యనిర్మలచేతనుఁ డై మది
                    దలఁచెడువాఁడును, దలఁపుఁ, దలఁపఁ
     బడియెడునదియును, నెడబాసి యంత
                    శాంతనిర్మలమానసంబుతోడ,
గీ. బరఁగు నిర్వాతదీపంబుభంగి నతఁడు
     పరము నగుచున్న నిర్వాణపదము నొందె.
     నని వసిష్ఠుండు బలియుపాఖ్యాన మిట్లు
     మనము దళుకొత్త రామచంద్రునకుఁ జెప్పె.70
క. ఈయాఖ్యానాకర్ణన
     మాయుః శ్రీ కీర్తు లిచ్చు నఘనిరసనమున్