పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

125

     న్ననఁ గూర్పు; వారి సంగతి
     ఘనవిషయము లణఁగఁ దత్త్వగతిలాభ మగున్.61
వ. అని యివ్విధంబునఁ దమతండ్రి యుపదేశించిన వాక్యంబులకు సంతు
     ష్టాంతరంగుం డై యచ్చేరువ నున్న శుక్రుం గని వినయావనతుండై
     బలి యి ట్లనియె.62
క. ఏ నెవ్వఁడ? నీ వెవ్వఁడ?
     వీనిఖిలము నెంతమాత్ర? మెట్టిది? యేరూ
     పే నిది? యెయ్యది గల? దిం
     దానతి యిం డనిన, శుక్రుఁ డతనికి ననియెన్.63
క. పెక్కు లిఁక నేల? మాకును
     గ్రక్కున దివి కరుగవలయు రక్షోదిప? నీ
     కొక్కటి తెలియఁగఁ జెప్పెదఁ,
     జక్కన విను సర్వశాస్త్రసారం బెల్లన్.64
గీ.. కణఁగి యెల్లచోటఁ గలది చిద్రూపంబు.
     అదియ నీవు నేను నఖిలములును.
     ఇదియ నిశ్చితార్థ. మిది దప్ప మఱి లేదు
     సర్వశాస్త్రసారసంగ్రహంబు.65
క. ఈయర్థము నిశ్చయముగ
     జేయక వేఱొక్కమతము సేయుట యెల్లన్
     వే యేల బూది వేల్చిన
     నేయినిఁ బోలియును మీఁద నిష్ఫల మందున్.66
గీ. అరయఁ జిత్తేచ్ఛయుత మగునదియు బంధ,
     మది విసర్జించి నిల్చిన నదియ ముక్తి,
     నియతిఁ జిత్తును జైతన్యకళ యనంగ
     సర్వసిద్ధాంతసంగ్రహసార మిదియ.67