పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

127

     జేయు, జగజ్జాలంబుల
     మాయిక మణఁగించి, మోక్షమార్గము దెలుపున్.71
వ. అని చెప్పి వసిష్ఠుండు రామచంద్రుం గనుంగొని యిట్టి తత్త్వజ్ఞానం
     బు పరమేశ్వరానుగ్రహంబున కాని సంభవింప, దీయర్థంబున ప్రహ్లా
     దోపాఖ్యానంబు గల దవ్విధంబు తేటపడ నెఱింగించెద.72

ప్రహ్లాదోపాఖ్యానము

సీ. వినుము ప్రహ్లాదుండు విష్ణు నారాధించి
                    బ్రహ్మవిజ్ఞానవిశ్రాంత మైన
     పరమవిచారంబు వరముగా నియతాత్ముఁ
                    డగునాకు హరియిచ్చె నాత్మబోధ,
     యది యెట్టిచందమొ మొదల నేనెవ్వఁడ?
                    నీసృష్టివిభ్రమ మెట్టి? దరయ
     నెక్కడి కేగెద? నేమాట లాడెద?
                    నెద్ది యంగీకార్య? మెద్ది కృత్య?
గీ. మరయ బ్రహ్మంబు, పర్వతతరువనంబు
     లతిజడంబును నైన యీయఖిలజగము
     నాత్మరూపంబుగాదు, నాకన్య మిదియు,
     నేను నీ సృష్టి గాకుని కిది నిజంబు.73
క. జడమును పవనస్ఫురణము
     గడు నసదుద్భవము నల్పకాలము నన తాఁ
     బొడవణఁగెడునదియును నగు
     నొడలును నేఁ గాన, యెట్లొకో తలపోయన్.74
సీ. కర్ణరంధ్రాంతరకలితక్షణంబున
                    జడము శూన్యము నైన శబ్దగుణము,
     అస్థిరత్వగ్గ్రాహ్య మతిభంగురము చిత్ప్ర