పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

వాసిష్ఠరామాయణము

     దలపు; మూఢుఁడ వై పోకు తమ్ముకుఱ్ఱ.49
మ. అకలంకాత్ముఁడ వై నిరామయుఁడ వై యానందచిత్తుండ వై
     సకలవ్యాపకతత్త్వబోధనిధి వై సమ్యగ్విధిన్ నీ మనో
     వికచాబ్జంబున నిన్ను నీవ యెపుడున్ వీక్షించుచున్ సంభ్రమో
     త్సుకభావంబులఁ బాసి నిత్యమును సంతుష్టుండ వై యుండుమీ.50
వ. అని యనేకప్రకారంబుల బోధించిన యగ్రజువాక్యంబులు విని పావ
     నుండు సర్వదుఃఖరహితుండును, సర్వసంగవిముక్తుండుసు, జీవన్ముక్తుం
     డు నై ప్రవర్లిల్లె నని పుణ్యపావనోపాఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు
     రామచంద్రున కి ట్లనియె. ఒక్కొక్కయెడలఁ బుణ్యాతిశయంబునం జేసి
     వైషయికసుఖము వైరాగ్యకారణం బగుట వర్ణింపంబడు. నీయర్థం
     బున బల్యుపాఖ్యానంబొక్కటి సెప్పెద; నాకర్ణింపుము.51

బల్యుపాఖ్యానము

క. అనుపమపుణ్యుఁడు వైరో
     చనుఁ డనుదనుజేంద్రవరుఁడు సకలావనియున్
     ఘనుఁ డై పదికోటుల హా
     యనములు పాలించి సౌఖ్య మందుచు నుండెన్.52
సీ. వసుధపైఁ గలమహావస్తుసమూహంబు
                    లన్నియుఁ గ్రమయుక్తి ననుభవించి,
     భోగేచ్ఛఁ దనిసి తా బుద్ధిలోఁ జింతించె
                    నొకనాఁడు మేడపై నుండి యతఁడు;
     'మూఁడులోకముల కద్భుతకారణంబును
                    నఖిలభోగాఢ్యంబు నైనరాజ్య
     మతిమోహమధురంబు నస్థిరంబును నిది.
                    యేటికి నీభోగ మేల నాకు?
గీ. ననుభవించుపదార్థమే యనుభవించి,