పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

121

     గనుఁగొని పుణ్యుండు తత్త్వగతి నిట్లనియెన్.44
క. ఈతండ్రికి నడలినగతి
     నాతతముగఁ దొంటిభవములందులఁ గల యా
     తాతలకుఁ బుత్త్రమిత్త్ర
     వ్రాతములకుఁ జుట్టములకు వగపం దగదే.45
వ. అది యెట్లం టేని.46
సీ. అనఘాత్మ విను మొక్కయద్రిశృంగంబున
                    సింహమ వై జనించితివి మున్ను,
     మఱి దశార్ణక్షితి మర్కటం బై పుట్టి
                    తగఁ దుషారంబున ధరణిపతికిఁ
     బట్టివై యుదయించి, పౌండ్రదేశంబున
                    కాకమై యుదయమై, క్రమముతోడ
     హైహయంబున మదహస్తి వై జనియించి,
                    గార్దభం బైతి త్రిగర్తభూమి,
గీ. సురఘుసుతుఁ డన సాల్వభూవరుఁడ వైతి;
     సరభసంబునఁ బక్షి వై సంచరించి,
     తేమి సెప్పుదు నీబాము లెన్నఁ బెక్కు;
     లందు నేబంధులకు నేడ్చె దనుజవర్య?47
క. జననీజనకులు పురుషున
     కనంతముగఁ బొలిసి పోదు. రది యేటిదియో!
     ననతరుపత్త్రము లెట్ల
     ట్లని యెఱుఁగుము. దీని కేల యడలెదు వత్సా?48
గీ. కలదు లే దను రెండుపక్షములనడుమ
     జరయు మరణంబు లేక నిశ్చలత వెలుఁగు
     నట్టిపరమాత్మతత్త్వ మవ్యగ్రబుద్ధిఁ