120
వాసిష్ఠరామాయణము
తండ్రిఁ బేర్కొని వనరుచు ధరణిఁ బొరలు
చున్న తమ్మునిఁ బొడగాంచి యుమ్మలించి.39
క. తూలుచుఁ డగ్గఱి కౌఁగిటఁ
గీలించుచుఁ గంటినీరు గీటి యతనిపై
ధూళి వెసఁ దుడిచి నెమ్మొగ
మాలోకించుచును బుణ్యుఁ డనుజుని కనియెన్.40
ఉ. ఏమిటి కిందు నొక్కఁడవ యేడ్చెద వక్కట! నేను గల్గ నీ
కేమి భయంబు? నీజనకుఁ డెందును బ్రాజ్ఞుఁడు, దివ్య మైన తే
జోమయసిద్ధిఁ గాంచె; విను శోకముఁ జెప్పఁగ నేల! మున్ను నీ
కీమహి తల్లిదండ్రు లీటు లెందఱు చావరు? లెమ్ము తమ్ముఁడా.41
వ. అది యెట్లంబేటేని; యత్యంతమోహవిస్తీర్ణంబును, శుభాశుభ తరంగి
తంబును, నైన వాసనామరుమరీచికాజలాశయం బనంతం బై ప్రవ
ర్తిల్లు, నందు పుత్త్ర మిత్ర్ర కళత్ర శత్రు లన నుదయించి స్నేహ
మోహ ద్వేష దోష దశామయం బై స్వసంజ్ఞామాత్రం బగు నీప్ర
పంచంబున శత్రుభావంబున శత్రుండును,మిత్త్రభావంబున మిత్త్రుండు
నై విషామృతభావారూఢి నుండు, నేకత్వంబున సర్వపరిపూర్ణం బగు
నాత్మ కితండు హితుం డితం డహితుం డను నివి కల్పనాకృతు. లిట్లు
గావున.42
గీ. పలలరక్తాస్థిమయదేహపంజరమున
నకట నే నేల యున్నాఁడ! నని తలంపు.
మేలు నీ వను నిద్ది యజ్ఞానబుద్ధి
గాని, పరమార్థమున వేఱు గలుగ దెందు.43
క. అని బోధించినఁ దెలియక
తనజనకుని తలఁచితలఁచి తలపోయుచు హా
యని యేడ్చుచున్న పావనుఁ