పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

119

     వై యిల విహరించుచుండు మనిశము రామా.34
క. వెలిఁ గృత్రిమసంరంభం
     బలవడఁ గర్తయును నీవ యై చిత్తములో
     పల సరభసకర్తృత్వం
     బులు దొఱఁగి చరింపు లోకమున రఘురామా.35
గీ. ఇతఁడు నాకు మిత్త్రుఁ డితఁ డమిత్త్రుం డగు
     నని తలంచువార లల్పమతులు
     తగ నుదారచిత్తు లగువారి కెందును
     వసుధ యెల్ల బంధువర్గ మరయ.36
తరల. వివిధజన్మశతావృతం బయి విభ్రమం బగుసృష్టిఁ దాఁ
     బ్రవిరళంబుగ వీరు బంధు లబంధు లీ రని చూడఁగా
     నవిరళభ్రమ గాని తాఁ బరమార్థ మెందును గాదు; త్రై
     భువనమున్ నెఱి బంధురం బగుబుద్ధి బంధువు గా దిలన్.37
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె.38
సీ. తనరు నీయర్థంబునను బుణ్యపావన
                    చరితంబు చెప్ప నచ్చెరువు వినుము,
     దీర్ఘతముం డనుదివ్యమునీంద్రుని
                    తనయులు పుణ్యపావనులు నాఁగ
     గల రిద్ద. ఱందు నగ్రజుఁడు బ్రహ్మజ్ఞాని
                    పుణ్యుండు. తమతండ్రి పుణ్యలోక
     గతుఁడైన విప్రసమ్మతితోడ నతనికి
                    బారలౌకికములు భక్తిఁ జేసి,
గీ. యనుజుఁ బొడగాన కెంతయు నడవి వెదకఁ
     బోవునప్పుడు కానలోఁ బొగలిపొగిలి