పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

117

గీ. అని విచారించి పరమసమాధి నొంది
     శాంతనిశ్చలచిత్తుఁడై జనకవిభుఁడు
     చిత్రరూపంబుకైవడి చేష్ట లుడిగి
     ధారుణీనాథ కొంతసే పూరకుండె.24
వ. ఇవ్విధంబున నుండి కొంతప్రొద్దునకుం దెలిసి యవ్వనంబు వెలువడి
     నిజపరిజనంబులం గూడుకొని.25
క. తనపురికి నరిగి జనకుఁడు
     పనుపడఁ గర్తవ్య మైనపనులు నిరీహం
     బునఁ జేయుచుండె నిచ్చలు
     దిననాథుఁడు దినము గడపు తెఱఁగున నధిపా.26

పుణ్యపావనోపాఖ్యాన్యము

.

వ. అని చెప్పి వసిష్ఠుండు వెండియు ని ట్లనియె - ఆకాశఫలపాకంబునం
     బోలె జనకజ్ఞానంబు వర్ణింపంబడియె. నట్లు గావున యోగసిద్ధి క్ర
     మాభ్యాసంబున సిద్ధించు నని మోక్షశాస్త్రంబుల వినంబడు. నీకథా
     కర్ణనంబునం జేసి యాత్మజ్ఞానంబు ప్రకాశించి చిత్తశాంతి యొన
     ర్చుఁ నట్టిపుణ్యపావనోపాఖ్యానంబు గల; దందు మొదలం బ్రశాంత
     స్వాంతుఁ డయ్యును జీవన్ముక్తుం డై వర్తించుట సెప్పంబడు. నాక
     ర్ణింపుము.27
సీ. అన విని రాముఁ డిట్లను మహాభాగ! నీ
                    మితవాక్య మతులగంభీర మరయ,
     విను మహంకారంబు విడు మని సెప్పితి
                    నీయహంకృతి మాన్ప నెట్లు వచ్చు?
     నిఖిలదేహంబులు నిశ్శేష మై పోక
                    యది యేకతమ మాన్ప నలవి యగునె?
     కూఁకటివేళ్లకుఁ గొడవంటఁ గోయక