పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

వాసిష్ఠరామాయణము

     బరిచర్య సేయుచుండెడు, నీప్రసాదంబున నుద్భవించినకుమారుండు
     పరమజ్ఞానసమర్థుండుగా దయజేయు' మనిన నల్ల కాక యనివీడ్కో
     ల్పుటయు, నద్దేవత చనియె నంత.85
క. నెలనాళులు నిండగ న
     ప్పొలతికి నుదయించె సుతుఁడు పుణ్యాత్ముఁడు ని
     ర్మలతేజోనిధి కడుఁ బెం
     పొలయఁగ నవలతకుఁ బుష్ప ముదయించుగతిన్.86
వ. ఇ ట్లుదయించుటయు నద్దేవి యక్కుమారు నెత్తుకొని చనుదెంచి
     యమ్మునిపుంగవుని పాదకమలంబులు సోఁక బాలునిఁ బెట్టి తానును
     వినయావనతవదనారవింద యై 'మునీంద్రా, నీప్రసాదంబున నుద
     యించినయిక్కుమారునకు జ్ఞానోపదేశంబు సేయుం డ'ని ప్రార్ధిం
     చిన నమ్మునిప్రవరుండు౼87
క. వేదములును శాస్త్రములును
     వేదార్థంబులుఁ బురాణవిద్యలుఁ గథలున్
     మోదమునఁ జెప్పి యొకనాఁ
     డాదరమునఁ బుత్త్రుఁ జూచి యమ్ముని పలికెన్.88
గీ. ఓకుమార నీకు నొకకథఁ జెప్పెద
     సర్వతత్త్వశాస్త్రసమ్మతంబు
     నఖలలోకసేవ్య మైనయర్థం బిది
     వినుము చిత్తగించి యనఘచరిత.89
సీ. స్వాంతుండు నా నొక్కసౌందర్యవంతుండు
                    భుజవీర్యవిఖ్యాతుఁ డజితబలుఁడు
     శ్రీమంతుఁ డుత్తమస్థితి యతిశూరుండు
                    రాజశిరోమణి రాజఋషభుఁ
     డారూఢకులజాతుఁ డసమానచారిత్రుఁ