పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105

                    డతిసూక్ష్మబుద్ధి గర్వాతిరూఢుఁ
     డతిసాహసుఁడు గలఁ; డతఁడు సేయఁగ సుఖ
                    దుఃఖకారణము లై తోఁప పనులు
గీ. తలఁచి చూడంగ జలనిధితరఁగలట్టు
     లెన్న గోచర మై యుండ నెసఁగు; నతఁడు
     విహరణక్షమలీలల విశద మైన
     యట్టి దేహత్రయము దాల్చి యలరుచుండు.90
వ. తచ్చరిత్రంబు జగంబులం దా నాక్రమించి యుత్తమమధ్యమాధమం
     బులై యుండు. నతం డాకాశంబునఁ జరించుపక్షియుంబోలె నంద
     సంచరించుచుండె. ననిన విని పుత్త్తుం డి ట్లనీయె.91
సీ. అయ్య, స్వాంతనాముఁ డతఁ డెవ్వ? డెబ్భంగిఁ
     దనువు లెన్ని దాల్చి వినుతి కెక్కె?
     నెచట నుండు? నాతఁ డేలీల విహరించెఁ?
     జెప్పు మనిన, నతఁడు చెప్పఁ దొణఁగె.92
క. విను పుత్త్ర, తెలియఁ జెప్పెద,
     ఘన మగుసంసారచక్రకలనం బిది; త
     జ్జననము సవస్తువిస్తర
     మును నగుకథ యగుట చిత్తమునఁ గనుఁగొనుమీ.93
సీ. పరమవియద్వీథిఁ బ్రభవించునట్టి సం
                    కల్పంబు స్వాంతవిఖ్యాతి నొందుఁ;
     దాన జనించుచుఁ దాన లీనతనొందు
                    నతఁడు యఖిలంబు నని యెఱుంగు;
     హరిహరబ్రహ్మాదు లందఱు నాతని
                    యవయవరూపు లై యలరుచుంద్రు;
     ఘనజగత్త్రయము నాతనిపట్టణం బగు;