పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

103

క. శ్రద్ధాజడమతి నెందును
     శుద్ధం బగుభూమి లేమి సూచి, యది కడున్
     శుద్ధం బని వృక్షముతుది
     సిద్ధాసననిష్టఁ దపము సేయుచు నుండెన్.81
సీ. ఆతనితపమున కగ్ని ప్రత్యక్ష మై
                    వరము లిచ్చుటయును వాడు మఱియుఁ
     దనరు నావృక్షాగ్రమున నుండి యజ్ఞార్థ
                    పరత మై మఱి దివస్పతిగుఱించి
     దశహాయనంబులు తప మాచరించుచు
                    మానసంబున వస్తుమహిమఁ గూర్చి
     నాకుల రప్పించి నరహయగోమేధ
                    యాగంబు లెన్నఁ బె క్కాచరించెఁ;
గీ. బరఁగ బహుదక్షిణల విప్రవరులఁ దనిపి
     కాలవశమున నాతనికర్మఫలము
     చిత్తనైర్మల్య మొందింపఁ జెన్ను మీఱ
     జ్ఞానరూపము దనయంత గానఁబడియె.82
వ. ఇవ్విధంబున దాశూరుండు నిర్మలజ్ఞానసమేతుం డై యుండునంత.83
చ. స్థిరమతి నొక్కనాఁడు వనదేవత యమ్మునినాథుపాలికిన్
     బరువడి నేగుదెంచి ప్రణిపత్తి యొనర్చుచు సంయమీంద్ర చె
     చ్చెర నొకపుత్త్రు నాకు దయ సేయుము; సేయక యున్న నీపదాం
     బురుహములొద్ద నే ననలమున్ వెసఁ జొచ్చెద నన్న నవ్వుచున్.84
వ. దాశూరుండు దనచేతికమలం బద్దేవికి సమర్పించి 'మాసమాత్రంబున
     విమలలోచనుండును శాంతుండును నగుతనయుం గాంచెదు, పొమ్ము;
     నన్ను నిర్బంధించి యడిగితివి గావున నీతనూజుం డజ్ఞాని యగు.' నని
     పలుకుటయు, నద్దేవతయుం బ్రసన్నముఖారవిందయై, 'యట్లేని నీకుం