102
వాసిష్ఠరామాయణము
వ. అనిన వసిష్ఠుం డి ట్లనియె.74
చ. ఒకమఱి రుద్రనిర్మితము, నొక్కొకవేళ విరించినిర్మితం,
బొకయెడ విష్ణునిర్మితము, నొక్కొకచో మునికల్పితంబు, నౌ
నొకకడ శూన్య మై యణఁగు, నొక్కొకపట్టును దాన కల్గు, సృ
ష్టికి నిది యిట్లె పుట్టు నని సెప్పుఁగరా దినవంశవల్లభా.75
వ. మఱియు నొక్కయెడ భూమి యంతయుం దరులతాకీర్ణంబగు. నొ
క్కచోట జనసాంద్రం బై యుండు. నొక్కకాలంబునఁ బర్వతాక్రాం
తం బై యుండు. నందొక్కవిరించిజననం బెఱింగించితి. నింతి.య కాని
సృష్టి కిది నిశ్చయం బన రాదు. ఈ యర్థంబున జగన్మాయాస్వ
రూపంబు తేటపడం జెప్పెద; నాకర్ణింపుము.76
ఉ. భూరిగుణాఢ్యుఁ డొక్కమునిపుంగవుకూర్మితనూభవుండు దా
శూరుఁడు వేదపారగుఁడు సువ్రతుఁ; డాతని తల్లిదండ్రులున్
ఘోరవనంబులోన మృతిఁ గూలిన బెగ్గిలి యేడ్చుచుండఁగా
ధీరతఁ దోఁప వచ్చి వనదేవత పల్కె దయాసమేత యై.77
ఉ. ఇచ్చటఁ గాన నొక్కఁడవ యేటకి నేడ్చెద? వన్న, యేడ్వఁగాఁ
జచ్చినవారు వచ్చెదరె, చావును బుట్టును సృష్టి కింతకున్
వచ్చినజాలు గాక, మనవారికె వచ్చెనె? దేహ కోటికిం
జచ్చు టనశ్య, మెందును విచారము సేయకు, దేహధర్మముల్.78
క. ఉదయంచుచు విహరించుచుఁ
బదపడి నస్తమితిఁ బొందుభానునిభంగిన్
విదితము జీవుల కెల్లను
నిది సహజము వీరి కడల నేటికిఁ బుత్త్రా.79
వ. ధీరోదాత్తుండ వై తెలిసి నిలువు మని బోధించిన నవ్విప్రకుమా
రుండు దుఃఖం బుడిగి; తల్లిదండ్రులకుఁ బరలోకక్రియ లాచరించి,
తపంబు సేయ నుద్యుక్తుం డై.80