అమ్మహేంద్రునకు శరద్వతుండు పుట్టె. ఆరాజచూడామణికి మయూరధ్వజుండు జని
యించె. ఆమయూరధ్వజునకుఁ గుముద్వతియుఁ, బుంజిలయు, నిషధయుఁ, జంద్రరేఖయు
నన నలుగురుభార్యలు గలరు. అందుఁ గుముద్వతికి శృంగవీర్యుండును, బుంజిలకుఁ గృష్ణుం
డును, నిషధకు దాల్బ్యుండును, జంద్రరేఖకు రామసేనుండును నుదయించిరి. అందు,
శృంగవీర్యుండు బ్రహ్మచర్యంబున విప్రత్వం బంగీకరించి, బ్రహ్మలోకంబున కరిగె. తదను
మతంబునఁ గృష్ణుండు సహస్రకాంతాసమేతుఁడై చతురంగబలంబులు గొలువ, భూదేవేం
ద్రుండన రాజ్యంబు నిష్కంటకంబుగా నేలుచుఁ, గుమారసహస్రంబుఁ గాంచె. ఆందు,
వజ్రుండు కోసలాధిపతి యయ్యె; నూర్వురుకుమారులు [1]యోగాభ్యాసపరులై [2]యుత్తమమార్గం
బునకుం జనిరి; మఱియు, నార్నూట[3]పదునొకండుగురు కిరాతులై యరణ్యప్రదేశంబు
చేరిరి; వెండియు నిన్నూటయెనుబదియెనమండ్రుగురుకుమారులు సమబలులై యన్యోన్య
కలహంబునఁ బ్రజాపీడకు లైరి. అంతఁ గలియుగం బాసన్నంబైన,