పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిట్లు దనసర్వసైన్యంబు ఋషిమణిప్ర, భూతచతురంగబలముచేఁ బొలిసిపోవ
మింట నమరులు గొనియాడ నొంటిఁ జిక్కి, నీలుఁడు పరాక్రమక్రీడ నెఱపిపడిన.

23


మ.

నరనాథాగ్రణి సిళ్ళు చూపినమహానాగంబునుం బోలె రో
షరసావేశమునన్ మణిప్రభవరాట్సైన్యంబుపై నెత్తి పో
యి రణక్రీడలు సల్పుచున్ మెఱయుటన్ హేతిప్రహేతిక్షపా
చరవీరుల్ విని పంపి రాత్మబలముతో జామాతకుం దోడుగన్.

24


వ.

ఇవ్విధంబునఁ బంపువడి వడి గలవారువంబులం బూన్చినకాంచనస్యందనంబు
లెక్కి లెక్కింప నొక్కొక్కనివెంట నొక్కొక్కయక్షోహిణిరక్కసులఁ గలిగి
సంఘనవిఘనప్రఘనవిద్యుత్ప్రభాశనిప్రభవిప్రజిత్తిప్రవీరప్రతర్థనాగ్నిదంష్ట్రవాయు
శత్రుభయంకరోన్మత్తాక్షభీమకర్ణసుఘోషాగ్నితేజు లనుపదేవురు హుటాహుటిం
జనుదెంచి భండనంబునఁ బ్రచండపరాక్రమక్రీడ వాలుదుర్జయనృపాలుం గని
మ్రొక్కి దేవా నీవాహవంబునకు వచ్చుట విని మీమామ లైన హేతిప్రహేతులు
పుత్తెంచినం బనివింటిమి మమ్ముం జూడు మని సంరంభంబున రత్నసంభవులమీఁదం
గవిసి పవిశితంబు లైనశిలీముఖంబుల నేసియు మండలాగ్రంబుల వ్రేసియు భిండి
వాలంబుల నొంచియు శూలంబులఁ జించియు సురియలం బొడిచియు ముసలంబుల
నడిచియు భుజావష్టంభంబున విజృంభించిన మరలుమాతంగంబులును దెరలుతురం
గంబులును సురుగురథంబులును దిరుగుపదాతులునై తమసైన్యంబు దైన్యంబు
వహించినం జూచి కించిదరుణలోచనాంచలంబులతోడ నారత్నసంజాతులు
దైతేయనాయకుల మార్కొని సుప్రభుం డైదుశిలీముఖంబుల సంఘనుని సురశ్మి
నాలుగువాలముల విఘనుని శుభుండు రెండుకాండంబులం బ్రఘనుని శుభదర్శ
నుండు పండ్రెండుమార్గణంబుల విద్యుత్ప్రభుని సుకాంతి మూఁడుతూపుల నశని
ప్రభుని సుందరుండు తొమ్మిదిసాయకంబుల విప్రజిత్తిని సుద్యుమ్నుండు పదికంక
పత్రంబులఁ బ్రవీరుని సుశీలుం డాఱుశరంబులఁ బ్రతర్ధనుని సుందుండు పందొమ్మిది
ప్రదరంబుల నగ్నిదంష్ట్రుని సుముఖుండు ముప్పదికోలల వాయుశత్రుని సుకాంతుం
డు పదియాఱుములుకుల భయంకరుని సోముం డొక్కభల్లంబున నున్మత్తాక్షుని
సుమనుం డిరువదియేనాశుగంబుల భీమకరుని శంభుండు పదునాలుగంబకంబుల
సుఘోషుని దీప్తతేజుండు పదునెనిమిదిబాణంబుల నగ్నితేజునిం బిలుకుమార్చి
పేర్చి దిక్కులు వగుల నార్చిన.


లయగ్రాహి.

నిర్జరవరప్రముఖదుర్జయుఁ డనంబరఁగుదుర్జయుఁడు తన్మణిజనుర్జనధనుర్జ్యా
వర్జితనిశాతశరనిర్జితనిశాటులఁ గృపార్జవమునం గనుచుఁ దర్జనలు బాహా