పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని విన్నవించుసురలం గనుఁగొని మధుకైఠభారి కలన దనుజులం
దునుమఁగ నిదె వచ్చెదఁ బొం డనుడు నమస్కృతులు చేసి హరిహయముఖ్యుల్.

53


క.

సంతోషంబున మేరు, ప్రాంతంబున కరిగి హరిఁ గృపావంతు రమా
కాంతు నిజస్వాంతంబులఁ జింతింపఁగ నంత మద్విజిత్వరబుద్ధిన్.

54


మ.

హరి వచ్చె న్విబుధావనద్విగుణరంహస్ఫీతచేతోనురూ
పరయావాప్తికి నాల్గుఱెక్కలు ధరింపంబోలు నాఁ గాంచనాం
బరకోణంబులు రెండువంకల నటింప న్మించునాగారి నె
క్కి రణత్కంబురథాంగనందకగదాఖేలద్భుజస్తంభుఁడై.

55


గీ.

ఇట్లు చనుదెంచి మాసైన్య మెల్లఁ గూల్చెఁ, బెక్కురూపంబు లై విష్ణుఁ డొక్కరుండ
వట్టిమ్రాఁకుల నొకదవజ్వాల దగిలి, వివిధముఖముల నీఱు గావించునట్లు.

56


క.

అప్పుడు దైవికమునఁ జే, తప్పితి మిరువురము దేవతలు తలఁపులలో
నుప్పొంగుసమ్మదాంబుధిఁ, దెప్పలఁ దేలంగ హరి యదృశ్యుం డయ్యెన్.

57


చ.

అదిమొద లబ్జనాభుని మహామహిమాఢ్యుని వేదవేద్యునిన్
బదిలముగా భజించిన నపాయము లేదని నిశ్చయించి త
త్పదసరసీరుహద్వితయభక్తివిలాసము నెమ్మనంబులం
బొదలఁగ నున్నవారము తపోనియమంబున నిన్నగంబునన్.

58


క.

కిన్నరపతికేళీవనికి న్నరవర నిన్న వచ్చి కీర్తింపుచు జో
క న్నియతి మరునిఁ గొలిచిన, కన్నియ లిరువురును మాకు గాదిలితనయల్.

59


సీ.

ఆకన్నియలకు నాయకుఁడవుగా నీవు తగుదువు మాకు నత్యంతమిత్రుఁ
డగుసుప్రతీకమహారాజుసుతుఁడవు గాన శక్రాదిదిక్పాలవరులఁ
గలన గెల్చినపరాక్రమవంతుఁడవు గాన జనులకు భోగమోక్షంబు లొసఁగ
నోపినవారణాసీపురంబునకు భర్తవు గాన రోహిణీధవజయంత
కంతునలకూబరాదులకంటె మిగులఁ, జక్కనికుమారుఁడవు గాన జలనిధాన
వలయితాఖిలవసుమతీవర్ణితాభిరామకీర్తివి గాన దుర్జయనరేంద్ర.

60


వ.

ఇప్పుడు మదీయపుత్రమిత్రకళత్రాదు లిచ్చటికి ననతిదూరంబునఁ బాటలం బను
పురంబున నున్నవా రచ్చటికి వచ్చి పరిణయంబు గావలయు నన్న నన్నరనాయకుం
డు నిరాయాసంబునం దనమనోరథంబు సఫలం బగుటకుఁ బరమసంతోషభరిత
హృదయుం డై వారలవవచనంబులు సబహుమానంబుగా నంగీకరించి ముందటఁ
బురంబునకుం జనుఁడు మీపిఱుందన యేనుం గదలి వత్తు నని వీడ్కొలిపి గంధ
పరంపరాసంపన్నంబు లైనపున్నాగంబులతోడ సదాగతివలమానంబు లైనపత్రం