పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

అంగంబుల్ హిమవారిచేఁ గడిగి రమ్యం బైనకూటంబులో
బంగారంపుఁజెఱంగుదుప్పటములం బాటీరజంబాలచ
ర్చం గల్పప్రసవంబులన్ మణివిభూషారాజి నందంబుగా
శృంగారించిరి సంభ్రమంబున సుకేశిన్ మిత్రకేశిన్ సఖుల్.

46


వ.

అంత నక్కడ హేతిప్రహేతులు తపోవనంబు వెడలి నిజతనూజామనోరథప్రా
పణపరాయణు లై చనువారు ముందట మీర లిద్దఱు నుద్దేశించి పోవుభూవల్లభుం
డు వచ్చి యిచ్చట నున్నవాఁ డని యెఱింగించినభంగి వెలుంగించుకోకిలకులం
బులచేత నభిరామం బైనకుబేరారామంబు దఱిసి తదభ్యంతరంబునఁ బూచినసం
పంగినీడ నిన్నం దనకనుంగొన్నకన్నియలు నేఁడు క్రమ్మఱ వత్తు రనుచిత్తంబున
విద్యారక్షకప్రముఖసఖసమేతంబుగా నేతెంచి నిలిచినదుర్జయనృపాలహర్యక్షుని
నిరీక్షించి.

47


సీ.

ఆత్మజృంభణసమయం బయ్యె నని మూర్తిమంతుఁడై యున్నవసంతుఁ డొక్కొ
దివ్యౌషదార్థ మేతెంచిన నాకవైద్యులకవలోపల నొక్కఁ డొక్కొ
తమవనంబున వినోదంబులఁ దగిలి క్రుమ్మరురాజరాజుకుమారుఁ డొక్కొ
మాముద్దుఁగూఁతులు నోమినచోన సాక్షాత్కరించినపుష్పచాపుఁ డొక్కొ
కాక మందరకుధరోపకంఠవాహి, నీనివేశంబు వెలువడి నిన్నబలెనె
హితపరీవారములతోడ నిచటఁ గేలి, సలుపుదుర్జయనరపాలచంద్రుఁ డొక్కొ.

48


క.

అని తమచిత్తంబుల భా, వన సేయుచు నికటమునకు వచ్చినవారిన్
మునివేషధారులం గనుఁ, గొని దుర్జయధరణిపాలకుఁడు మ్రొక్కుటయున్.

49


గీ.

అతని దీవించి చంపకక్షితిరుహంబు, నీడ నాసీనులై ధరణీతలేంద్ర
యేమహాత్మునితనయుండ వెద్ది నీకు, నామ మిచటికి రాఁ బని యేమి గలిగె.

50


చ.

అనవుడు నవ్వి యేను వసుధాధిపశేఖరుఁ డైనసుప్రతీ
కునితనయుండ దుర్జయుఁడ ఘోరపరాక్రమసంపద న్మదిం
చిననృపసార్వభౌముల శచీపతిముఖ్యదిగీశవర్గమున్
మునుకొని గెల్చి పోవుచు వినోదము సల్పఁగ నిందు వచ్చితిన్.

51


సీ.

ఇది నాతెఱంగు మీ రెవ్వరు మునులార వినిపింపుఁ డనిన ని ట్లనిరి దుర్జ
యక్షితినాథ స్వాయంభువమనువుసూనులము హేతిప్రహేతులము మేము
లోకభీకరులమై నాకంబునకు దాడి వెడలి యింద్రాదుల విఱుగఁదోల
నాసుపర్వులు కలశాబ్ధికిఁ బోయి లక్ష్మీనాథునికి నమస్కృతులు చేసి
దేవ హేతిప్రహేతిదైతేయవరుల, చేత నొచ్చినమమ్ము రక్షింపు కరుణ
నాజి మును కాలనేమిసహస్రభుజుల, సంహరించినగతి వారి సంహరించి.

52