పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తనదుర్గమునకు నక్తందివంబును సితభానుభాస్వంతులు ప్రహరి దిరుగ
రక్షోభయంకరైరావణమదగంధనాగంబు దనసాహిణమున నుండఁ
దనశాసనమును హుతాశనాఖిలదిశానాథులు మకుటకోణములఁ దాల్పఁ
గులధరాధరపక్షములు విభాళించినదంభోళి తనకటితాప గాఁగ
వాలి ముల్లోకముల నేలు వాసవుండు, నీతురంగమధాటికి నిలువ లేక
పాఱి తిన్నూళ్ళతిప్పలు పట్టినాఁడు, శూరుఁడవు నీవ దుర్జయక్షోణిపాల.

65


మ.

అనినన్ మానవలోకభర్త భవదాఖ్యల్ చెప్పుఁడా యేమి గో
రి ననుం గానఁగ నేగుదెంచితిరి సంప్రీతాత్ములం జేసి పు
త్తు నటన్నన్ విని వార లి ట్లనిరి విద్యుత్తున్ సువిద్యుత్తు నా
ననుభూతాఖ్యుల మైనదైత్యులము బాహాగర్వదుర్వారకా.

66


శా.

ఆకర్ణింపుము మత్సమాగమనకార్యం బష్టదిక్పాలకీ
లోకంబున్ విదళించి వచ్చితివి గళ్ళుం బాళ్ళు చిక్కంగ నా
లోకంబుల్ మనుపోలె నుండ మది నాలోకించి మా కీ వృధా
పోకార్పం బనిలేదు నావుడు దృగంభోజంబుల న్నవ్వుచున్.

67


క.

సచివుల నాలోకించిన, నుచితం బీకార్య మనుడు నుర్వీపతి రా
త్రిచరులకు నిచ్చె నాక, ల్పచామరాందోళికాతపత్రకళాచుల్.

68


వ.

ఇవ్విధంబున మన్నించి విద్యుత్సువిద్యుత్తుల నిరీక్షించి యేను దిక్పాలకలోకంబులు
నిర్వక్రపరాక్రమంబున నాక్రమించువేళ మదీయకులగురుండు దుర్వాసోముని
వరుండు సకలజగత్సేవ్యమానుం డైనయీశానుదివ్యాంశంబున జన్మించినకారణం
బున నట్టియీశానుం డున్నలోకంబునకు మనంబున నుపద్రవంబు సేయం దలం
చుట మహాద్రోహం బని మానితి మీరు మఱచి తప్పియును నప్పరమాత్మునిలో
కంబుదిక్కు పోవక సంక్రందనసప్తజిహ్వసమవర్తిసంతమసవతిచరసలిలాధిపతి
సమీరసంపత్పతిలోకంబు లేలుకొండని పట్టదోరణచీట్లు వెట్టించి వీడ్కొలిపిన
నాపూర్వగీర్వాణసార్వభౌములు సేనాసమన్వితులై చని తమకు నమరావతీపురం
బు రాజధానిగా వసించి దుర్వారగర్వంబున విహరింపుచు నర్చిష్మతీపురంబు పా
లింప విషజిహ్వుం డనునక్తంచరుం బంపి సంయమనీపురంబు శాసింప నుద్దండుం
డనుదనుజాగ్రణిం బంపి కృష్ణాంగనాపురంబు నిర్వహింప ఖడ్గహస్తుం డనుదానవ
పతిం బంపి విమలావతీపురంబు సవదరింపఁ గబంధుం డనుదైతేయనాయకుం బంపి
గంధవతీపురంబు రక్షింప వేగవంతుం డనురాక్షసాధ్యక్షుం బంపి నవనిధానధా
మంబు గావున నలకాపురం బురువు గావింప మిగుల నాప్తుం డైనదీప్తాలకుం డను