పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధనదీప్తిచ్ఛటన్ వెలుంగ విహగాధ్యక్షాంసపీఠాగ్ర మె
క్కి నిషాధాగ్రణిముందట న్నిలిచి లక్ష్మీభర్త లేనవ్వుతోన్.

154


క.

కనుఁగొని కరుణారసవా, హిని మనమున వెల్లివిరియ నిచ్చెద వరముల్
గొనుము వలసినవి నీవ, ర్తనమునకు న్మెచ్చినాఁడ ధర్మవ్యాధా.

155


సీ.

అనిన శ్రీహరికి నిట్లని విన్నవించెఁ బుళిందుండు నాకు నా నందనులకు
దయచేయు మాత్మవిద్యాయుక్తసకలకళావత్కవిత్వంబు దేవదేవ
వసుమతిపై నధవా నన్నుఁ బుట్టింప నూహ గల్గిన ధర్మయుగమునంద
పుట్టింపు మద్వంశమున జనించినవారి విజ్ఞానపరులఁ గావింపు మంత
మీఁద నీ మేన లయముగా నాదరింపు, మనుచుఁ బ్రార్థింప నోయి మహాకవీంద్ర
వరము లన్నియు నిచ్చితి వచ్చి నన్నుఁ, గూడు మిప్పుడు నావుడుఁ గూడె నతఁడు.

156


వ.

కావున ధర్మవ్యాధుండు పఠించినయీవిష్ణునామస్తవంబు వైష్ణవంబు లైనవాసరం
బుల నుపవసించి మురారి నారాధించి తాత్పర్యంబునం జదివిన వినిన మానవులకు
వైకుంఠంబున సప్తతిమన్వన్తరంబులు వసింపం గలుగు నని చెప్పిన విని విశ్వమూర్తి
యైననారాయణుం డాదికృతయుగంబున నేమి చేసె నానతి మ్మనిన విశ్వంభరకు
దంభకుంభినీదారం బిట్లనియె.

157


సీ.

స్వచ్ఛందకర్మానుసంధాత నారాయణుండు పూర్వమున నొకండ నిలిచి
నిమిషంబు నుబుసుపోవమికి వేసరి ద్వితీయాన్వేషణము చేయ నతనివలన
బుధ్యాత్మికయుఁ బరిస్ఫురదహస్కరరూపిణియు నైనచింత జన్మించె నదియ
తలఁప నకారంబు తదకారమున రెండు చింతలు పుట్టెఁ జర్చింపఁగా ను
కారము మకార మనునవి కంబుకంఠి క్రమముతో పట్టి మూడువర్ణములుఁ గూడి
యేకవర్ణత్వమునఁ బొంది లోకజనన, రక్షణక్షయకర మైనప్రణవ మయ్యె.

158


వ.

ఆప్రణవంబున భూర్లోకంబును భూర్లోకంబున భువర్లోకంబును భువర్లోకంబున
సువర్లోకంబును సువర్లోకంబున మహర్లోకంబును మహర్లోకంబున జనలోకం
బును జనలోకంబునఁ దపోలోకంబును దపోలోకంబున సత్యలోకంబును
సంభవించె నిట్లు సంభవించి సూత్రంబున మణిగణంబులుం బోలె నున్న
శూన్యలోకంబులు విలోకించి ప్రణవస్వరూపియుం ద్రిమూర్తిస్వరూపియు నైన
నారాయణుండు వరేణ్యమూర్తి నొక్కటి నుత్పాదింప నూహించి తనమనంబు సం
క్షోభింపం జేసిన నమ్మనంబున స్వమాత్రకం బగునకారంబు నిలిచె నకారంబును సం
క్షోభింపం జేసిన నందు బ్రహ్మాండంబు పుట్టె నది రెండువ్రక్క లైన నడుమ భూలో
కంబు గానంబడియె భాస్కరసన్నిభుండునం గమలకోశవ్యవస్థితుండును బ్రమాణ