పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆగతి మత్ప్రవిష్టసకలాంగరుహంబులతోడ ముక్తిల
క్షీగృహ మైనవిష్ణుపురికిం జని భోగపరంపరైకదీ
గుణయుక్తి నందు నొకకల్పము నీవు వసింప నేనుఁ దే
జోగరిమంబున న్విడువఁ జూ నిను సోఁకిననాఁటనుండియున్.

71


సీ.

అంతట దివసాంత మగుటయు బ్రహ్మ నిద్రాసమన్వితుఁడై రాత్రి గడపి
మఱునాఁడు సృష్టినిర్మాణంబు సేయుచో మేదినీశ్వర నిన్ను నాదిసృష్టిఁ
గృతయుగంబున వినిర్మించెఁ గాశ్మీరాధిపతి సుమనోనరపాలువలన
నిర్మింప నేనును నీతనూరుహములతోన పుట్టితి శశిలోనికందు
పగిది నావిధంబునను శ్రీపతిపదాబ్జ, పూజ వెలిగాఁగ నీజన్మమున ననేక
యజ్ఞదానాదిపుణ్యకృత్యములు నియమ, పరతఁ జేసితి చేసినఁ బాయ నైతి.

72


మత్తకోకిల.

అక్షయప్రతిబంధరూపమ నైననన్ను వసుంధరా
ధ్యక్ష యిప్పుడు విష్ణుభక్తుఁడ వై పఠించినపుండరీ
కాక్షపారము తావకాంగరుహంబులం బెడఁబాపుటన్
మోక్షసంపద చేరెడు మనమున్ సుకర్మముఁ గోరెడున్.

23


వ.

అని చెప్పిన వసునృపాలవర్యుం డాశ్చర్యంబునం బొంది ముందటం గిరాతరూపం
బున నున్న పురాతనబ్రహ్మహత్యాపాతకంబు నవలోకించి నాకు నీకతంబునఁ బూ
ర్వజన్మసంస్మరణంబు గలిగె నీవును మత్ప్రసాదంబున ధర్మవ్యాధుండవు గమ్మని
వరం బిచ్చి ప్రత్యక్షం బైనపరతత్వంబునుం దానును దివ్యవిమానం బెక్కి చనియె
నప్పుండరీకాక్షపాఠస్తవంబు పఠించిన నాకర్ణించినం బుష్కరతీర్థయాత్రాఫలంబు
సిద్ధించు నని చెప్పిన విశ్వంభరావధూటి దేవా వసునరేశ్వరుండు ముక్తుం డగుట
యెఱింగి రైభ్యుం డేమి చేసె నానతి మ్మనిన వరాహదేవుం డి ట్లనియె.

24


క.

ధరణీ కాశ్మీరాధీ, శ్వరుఁడు వసువు ముక్తికాంత వరియించుట భూ
సురకోటి చెప్పె రైభ్యుఁడు, హరిపూజాపరుఁడు తీర్థయాత్రోన్ముఖుఁడై.

25


సీ.

చేదోయి నొసలఁ జెర్చె ననంతశాయికి రంగధామునకు సాష్టాంగ మెఱఁగె
ప్రణమిల్లెఁ గాంచివరదరాజునకు నమస్కృతి చేసె వేంకటాద్రీశునకును
మ్రొక్కె నహోబలేంద్రునకు సింహాచలనాయకునకు వందనము ఘటించె
నతి సల్పె శ్రీకూర్మపతికి దండంబు సమర్పించెఁ బురుషోత్తమాధిపునకు
సరవి నీ వైష్ణవస్థానపరిసరములఁ, గలనదీసరసీవాపికాతటాక
ముల మునుంగుచుఁ దత్తీరపుణ్యగహన, కుసుమసౌరభ్యసంపద కొల్లగొనుచు.

26


క.

భాగీరథికిం బోయి ప్రయాగమునకు నేగి పిదప నారైభ్యమహా
యోగి చనియెఁ బితరులఋణ, మీగికొనఁగ దురితహరిణమృగయకు గయకున్.

27