పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొడవంటివంకలగొగ్గిపండులవాఁడు దుమ్ముపట్టినబొక్కిఱొమ్మువాఁడు
గాటంబుగా నిర్లు గవియుదేహమువాఁడు కడు నక్కళించినకడుపువాఁడు
వైపు దప్పినచేతులవాఁడు మొద్దు, వ్రేళ్ళవంకరకొంకరకాళ్ళవాఁడు
కుఱుచవాఁడు వికారపుగూనివీఁపు, వాఁడు కాలినకొఱడుభావమున వెడలె.

45


గీ.

వెడలి సాంజలియై వసూర్వీకళత్ర నన్ను, బనిగొమ్ము నావుడు నిన్నుఁ బనిగొ
నంగ నేటికి నాకు నీనామ మేమి, యేకతానకు వచ్చితిరా కిరాత.

46


గీ.

అనినఁ గాశ్మీరపతికి ని ట్లనియె వాఁడు, తొంటిభవముననుండి నీవెంటవెంట
నంటువాయని నీబ్రహ్మహత్యఁ గాని, యేఁ గిరాతుండఁ గాఁ జుమీ నృపవరేణ్య.

47


సీ.

అది యెట్టి దనిన నీ వవధరింపుము గతకలియుగంబునఁ బౌండ్రకులమునందు
జనియించి యామ్యదిశావధూచరణమణీనూపురము జనస్థానపురము
పరధరిత్రీనాథు లరిగాపులై భజింపఁగ నేలి దోఃప్రతాపమున వ్రాలి
కరులు వాజులు శతాంగములు పదాతులు వెంటరా నొకనాఁడు వేఁట వెడలి
కాననము చొచ్చి శార్దూలఖడ్గసూక, రప్రముఖజంతుసంతతి వ్రచ్చి నచ్చు
నారసంబున మృగవేషధారి యైనః యతికులస్వామిఁ గూలనేసితివి నీవు.

48


గీ.

వేయుటయుఁ గొంతదూరంబు పోయి మృగము, ప్రస్రవణశైలకందరాభ్యంతరమునఁ
బరమతాపసవేషియై పడియెఁ బడిన, నది నిజాలకు సొరంగ మనుచు డాసి.

49


క.

కృతకహరిశాతనఖర, ప్రతిభటశాతాంబక ప్రపాతాంగవిని
ర్గతరక్తసిక్తమునికుల, పతి నీక్షించితివి గుండె బగ్గునఁ బగులన్.

50


మ.

మునిచూడామణి నట్లు చూచి భయసంపూర్ణాంతరంగుండవై
కనుగెందమ్ముల జాఱి మేన వఱదల్ గట్టంగ బాష్పాంబువుల్
వనికావాటికి వేఁట రారె హరిణవ్రాతంబులం జంపరే
కనిరే పాతకి నైన నేను బలె దుష్కర్మంబు ధాత్రీపతుల్.

51


సీ.

అక్కటా పరమసంయమిఁ జంపి క్రమ్మఱఁ బురికి నే నేమని పోవువాఁడ
నాసరిమేదినీనాథులలోన నే నేచందమునఁ దల యెత్తువాఁడ
నేతరంబున లేనియియ్యపకీర్తిపంకంబు నే నేమిటఁ గడుగువాఁడ
దరిదాపు లేని దుస్తరపాతకాంబునిధానంబు నే నెట్టు దాటువాఁడ
ననుచుఁ బెక్కువిధంబుల నడలి బడలి, వేదనానలశిఖలచే వెచ్చి నొచ్చి
కారణము లేక తగిలినకల్మషంబు, బయలుపడనీక మనసునఁ బదిలపఱచి.

52


క.

మాటికి నిఁక సంసారం, బేటికి ననుబుద్ధి పుట్టఁ బృథ్వీశ్వర న
ట్టేటికి నెదు రీఁదినగతి, వీటికి వచ్చితిని మరలి విన్నఁదనముతోన్.

53