పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రైభ్యుఁడు వసుభూపతియు సు, ధాధ్యవహారగురుతోడ నద్వైతజ్ఞా
నాభ్యాసము చేసి తదీ, యాభ్యున్నతి నేమి యైరి హరికిరివర్యా.

35


చ.

అనవుడు దేవుఁ డిట్లనియె నట్లు బృహస్పతిచేత బోధమున్
విని వసుభూవిభుండు దనవీటికి నేగి జగజ్జనానురం
జనకరుఁడై వసుంధర భుజాభుజగంబునఁ దాల్చి శాత్రవా
వనిపులఁ గూల్చి విష్ణుని వివర్జితభేదమునం భజించుచున్.

36


ఉ.

చేసె ననేకయాగములు జీవనసౌఖ్యము నెమ్మనంబునన్
రోసె వివస్వదాహ్వయతనూజునిపై నిజరాజ్యభారమున్
వేసె వివేకనిష్ఠురలవిత్రముచే నఘపాశబంధముల్
గోసెఁ బురీనివాసమునకుం బెడఁబాసె బుధుల్ నుతింపఁగన్.

37


వ.

ఇట్లు సంగపరిత్యాగంబు గావించి తపోవనంబునకుం జని కాశ్మీరవల్లభుండు పుండ
రీకాక్షపారస్తవంబు జపించుచు నియతాత్ముండై.

38


క.

పుష్కరతీర్థతటంబున, దుష్కరతప మాచరించి తుది ముందట నా
విష్కారంబునఁ బొందిన, పుష్కరపత్రాక్షుదేహమున లయ మయ్యెన్.

39


గీ.

నావుడు మహావరాహంబునకు ధరిత్రి, దేవ నీభక్తురాలికిఁ దెలియఁ జెప్పు
పరమనుతిఁ బుండరీకాక్షపారమును వ, సుక్షమాపాలనాథుని మోక్షగతియు.

40


వ.

అనిన నద్దేవుండు సవిస్తరభాషావిశేషంబున.

41


గీ.

అఖిలవేదాంతవేద్య మహం భజామి, సంభవక్షయరహిత మహం భజామి
సాసిచక్రాబ్దశార్ఙ్గ మహం భజామి, కుంభసాగరశయన మహం భజామి.

42


పృథ్వి.

నమామి మధుసూదనం నవపయోదనీలత్విషం
నమామి పరమేశ్వరం నఖరభిన్నరాత్రించరం
నమామి పురుషోత్తమం నలినగేహినీనాయకం
నమామి కరుణాస్పదం నగధురీణతాదక్షిణం.

43


వ.

అని వసుమహీశ్వరుండు సంస్తుతించె నిది పుండరీకాక్షపారస్తవంబు వెండియు
నతండు పుండరీకాక్షు నుద్దేశించి మహాత్మా చరాచరప్రపంచంబున నెద్దియు భవ
ద్వ్యతిరిక్తంబు లేదు సర్వంబును భవన్మయంబకా నెఱిఁగినవాఁడ నని పలుకునవ
సరంబున వానిశరీరంబువలన.

44


సీ.

గిరికొన్నపల్లజుంజురువెండ్రుకలవాఁడు మిసమిస మనుమిట్టనొసలివాఁడు
కోరచూపులయెఱ్ఱ చేరుగ్రుడ్డులవాఁడు బైసిమాలినమ్రానిపణతవాఁడు