పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నమలె క్షుధాతురాణాం నరుచి ర్నయోగ్య మటన్న పలుకు తథ్యంబు గాఁగ
నపుడు వశిష్ఠసంయమి వచ్చి ధర్మాత్మ కటకటా స్వాస్థిభక్షణము నీకు
నుచితమే యన్న నేమి చేయుదు మునీంద్ర, యిన్నినీ ళ్ళైన వంటకం బించు కైనఁ
దొల్లి దానంబు చేయనిదుష్కృతమున, నిర్భరక్షుత్పిపాసలు నిలువ వనిన.

66


క.

ఇత్తఱి నేమనఁ గలదు నృ, పోత్తమ ము న్నన్నదాన మొనరింపవు నా
దత్త ముపతిష్ఠ తని వి, ద్వత్తిలకము లాడుకొనెడువాక్యము వినవే.

67


వ.

రత్నహేమాదిదానంబు చేసినవార లవియ కలవా రగుదురు సకలప్రాణిసంతర్పణం
బగునన్నదానంబు చేసినవారలకు నన్నిదానంబులం జేసినఫలంబులు గలవు తాదృశ
ప్రభాసంపన్నం బగునన్నదానంబు నీవు చేయ నెఱుంగ వైతి వనిన భట్టారకా నాకు
నాఁడు పట్టినధనగర్వం బట్టిది యిట్టిదురవస్థ యెట్టు దొలఁగు మున్ను పెట్టని
జలాన్నంబులఫలంబు లిప్పుడు నాకుం గలుగునుపాయంబు చేయ నవధరింపు
మనిన భూవరా నీవలెనే తొలి సునీతుం డనుమహారాజు నర్వమేధాధ్వరంబులు
సలుపుచు నన్నదానవిరహితంబుగా విప్రులకు సకలదానంబు లొసంగి శరీరావ
సానంబున నాకలోకభోగంబు లనుభవింపుచుండియు నాఁకట నన్నంబున కేఁకట
పడి సకలలోకంబులం బరిభ్రమింపుచు నిజకళేబరంబు దహించినమాయాపురిపరి
సరంబున భృగుమహామునిం గని విషయంబునఁ దనవృత్తాంతంబు విన్నవించిన
నమ్మహానుభావుండు సునీతు నవలోకించి నీకు నేతద్దౌస్థిత్యనివారణకారణం బగు
నొక్కమహావ్రతంబు చెప్పెద వినుము కార్తీకమాసంబునం గాని మార్గశిరమాసం
బునం గాని శుక్లపక్షదశమి నేకభుక్తిసంకల్పంబు లొనరించి యేకాదశినాఁ డుపవ
సించి నాఁటిరాత్రి శృంగారితమంటపాంతరఁబున ధరణీవ్రతంబుచందంబున నా
లుగువంకల నాలుగుకలశంబులు నిలిపి తన్యధ్యంబున బ్రహ్మవిష్ణుమహేశలోకపా
లాదిదేవతలను సర్వౌషధీరసాన్వితభూచక్రంబును వహించినకాంచనవిరచితబ్ర
హ్మాండభాండంబును నిలిపి తదుపరిస్థలంబున నారాయణు భావించి కార్తికోక్తమం
త్రంబులం గాని మార్గశీర్షోక్తమంత్రంబులం గాని పాదాదికేశాంతంబును గేశాదిపా
దాంతంబును గాఁ బూజించి జాగరణంబు గావించి ద్వాదశినాఁడు సూర్యోదయా
వసరంబున వేదవేదాంగపారంగతు లైనవిప్రపుంగవులు నలువురకు నాల్గుకలశం
బులు దానంబు చేసి నడిమి బ్రహ్మాండకలశంబు కుటుంబియు శాంతుండును నేత
త్కథావిధిజ్ఞుండు నగు నాచార్యునకు సాంగంబుగా సమర్పించినధన్యు లనేక
యుగంబులు విష్ణులోకంబున సుఖం బుండి ముక్తికాములు ముక్తు లగుదురు భుక్తి
కాములు భూమిం జనియించి సకలసామ్రాజ్యసుఖంబు లనుభవించి పిదప ముక్తు
లగుదురు.

68