పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తనపురోహితు వశిష్ఠునిఁ జూచి మునికులోత్తమ సహస్రాశ్వమేధములు చేయ
వలె విప్రులకు నన్నజలదాన మొసఁగుట యెందులోనిది యింక హేమకాంస్య
రత్నభూషాంబరగ్రామగజశ్వాదు లొసఁగుదు విరహితాన్నోదకముగ
నని లిఖితాత్మశాసనహేమపట్టికాసహితఫాలము లైనజవనహరుల
వరుస విడిపించె నవియు దుర్వాసలీల, వారణతురంగరథభటవాహినీప
రంపరలు వెంట రాఁ జొరరానిచోటు, లెల్లఁ జొచ్చి చరించె మహీస్థలమున.

59


చ.

హరిదవధిక్షమారమణు లాతురగాళినుదుళ్ళపట్టముల్
తరువులరాయసంబులవిధంబునఁ గన్గొని శ్వేతమానవే
శ్వరునకుఁ దెచ్చి యిచ్చినసువస్తుపరంపర లెక్కఁ గూడు పె
న్వెరసులరీతిఁ దత్సవనవీతిఖురాంకము లుండు నుర్వరన్.

60


సీ.

ఆజ్యవేదన కోర్వ కనలుండు జలధిలో బాడబాకృతి దాల్చి నేఁడు నుండు
మందాగ్నిదోషంబు మానుటకై సదా వ్యాయామ మొనరింతు రర్కవిధులు
కరిముఖుం డెప్పుడు కడుపుబ్బు డిగ్గనికతన లంబోదరాఖ్యాకుఁ డయ్యె
నఱగమి పుట్టి యింద్రాది దేవతలకు నెన్నఁడు వంటకం బింపు గాదు
శ్వేతభూతలభర్త వశిష్ఠముని పు, రోధగాఁ జేసినతురంగమేధమఖస
హస్రములఁ గల్గుకమ్మనిహవ్యతతులు, మీటు మిగులంగ మెసఁగిననాఁటనుండి.

61


ఉ.

శ్వేతుఁడు నశ్వమేధములు వే యొనరించి సమస్తభూతధా
త్రీతల మెల్ల నేలి తనతేజముఁ గీర్తియు నుష్ణభానుజై
వాతృకు లట్టు సంతతము వర్తిలఁ జేసినపిమ్మటన్ బలా
రాతియుఁ బోలె నాకనగరస్థితి గైకొని పుణ్యసంపదన్.

62


క.

తుంబురునారదమునిగీ, తంబులు రంభోర్వశీఘృతాచీకృతనా
ట్యంబులు సిద్ధతపస్విక, దంబస్తోత్రములు సమ్మదం బొనరింపన్.

63


గీ.

వివిధమహిమ లనుభవించుచు నుండియు, మండుజఠరవహ్ని మాన్పరాని
దప్పితోడఁ గూడి నొప్పింపఁ గన్నులు, మేను దిమ్మదిరిగి మిడికిపడుచు.

64


ఉ.

ఆలలనావతంసముల నమ్మునులం గని జాఠరానల
క్ష్వేళభరంబు నేత్రములఁ జీఁకటి గొల్పఁగ నాట లేల యీ
యాలకు లేటికిం జెవుల నంతకు పల్కులు పోవ నిన్నియుం
జాలును దుఃఖితే మనసి సర్వ మసహ్య మటం టెఱుంగరే.

65


సీ.

అని పల్కి శ్వేతభూపాగ్రగణ్యుఁడు శ్వేతధరణీధరంబున కరిగి తనదు
బొంది ము న్నాకొండపొంత ఖండించినచోటిశల్యము లతిక్షుద్భరమున