పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంబులు సలిపి యింద్రయమవరుణకుబేరదిగ్దళంబుల భద్రప్రద్యుమ్నానిరుద్ధవాసు
దేవుల నర్చించి యీశానాగ్నినిఋతివాయుదిగ్దళంబుల శంఖచక్రగదాపద్మంబుల
యథాక్రమంబున నర్చించి మఱియు నీశానభాగంబున ముసలంబును దక్షిణభా
గంబున గరుడునిం బూజించి శరశరాసనకృపాణశ్రీవత్సకౌస్తుభంబులు దేవునిపురో
భాగంబునం బూజించి వైష్ణవకలశంబున ముక్తికాముని నైంద్రకలశంబున సంతత
శ్రీకాముని నాగ్నేయకలశంబునఁ బ్రతాపకాముని యామ్యకలశంబున మృత్యుం
జయకాముని నైఋతికలశంబున దుష్టప్రధ్వంసకాముని వారుణకలశంబున శాంతి
కాముని వాయుకలశంబునఁ గల్మషనాశకాముని గౌబేరకలశంబున సంపత్తికాముని
నైశానకలశంబున సుజ్ఞానకామునిఁ దత్తన్మంత్రంబులతో నభిషేకంబు సలిపిన వారి
వారికోరికలు సిద్ధించు నింక నవకలశంబుల నభిషిక్తు డైనధన్యుం డిహలోకంబున
విష్ణుసదృశుండై సకలసామ్రాజ్యసౌఖ్యంబు లనుభవించు నివ్విధంబున మదుక్త
ప్రకారంబున శోషణదాహనప్లావనంబులఁ దత్త్వశోధనంబున నోన్నమోభగవతే
విష్ణవేస్వాహా యనుమంత్రంబునం జేసినహోమంబున విష్ణుసూక్తంబు చెప్పుచు
శంఖోదకంబునం జేయునభిషేకంబున గురునిచేత దీక్షితుం డైనసమయం బెఱింగి
గురువుల హ స్త్యశ్వరథగ్రామభూషణాదికంబుల యథాశక్తి సంభావించి దక్షిణా
యుక్తంబుగా బ్రాహ్మణులకు భోజనంబు పెట్టి సాత్వికుండై సకలదేవబ్రాహ్మణవేద
నిందలం దొలఁగి వర్తించుపుణ్యులమాహాత్మ్యంబు చెప్ప నశక్యంబు వైష్ణవదీక్ష
గైకొని యెవ్వరేని యేతద్వతాచరణప్రకారంబు విందురు వారికి సంక్రమణగ్ర
హణవిష్ణువాసరాదిపుణ్యకాలంబుల దేవహ్రదకురుక్షేత్రపుష్కరవారాణాస్యాది
పుణ్యతీర్థంబుల వేదపారాయణంబు చేసినఫలంబు సిద్ధించు దేవతలును భారతవర్షం
బున జనించి వైష్ణవదీక్ష వడసి వారాహంబు విని కార్తికమాసంబునఁ జేయు
వారాహయాగంబు చూడ నెన్నఁడు గలుగునో యని కోరుచుందురు విశ్వంభరా
యేతత్ప్రకారం బెఱింగి మదుక్తసర్వాభీష్టప్రదలక్ష్మీనారాయణమండలంబు చూచిన
మానవుండు రెండవవిష్ణుం డగు నింక నేమి వినవలతు వడుగు మనిన.

49


శా.

స్వామీ మున్ను సరోరుహాసనతనూసంభూతగాయత్రి వే
త్రామర్త్యారి వధించి నంద యనునాఖ్యం జెంది తద్బ్రహ్మచే
భీమాజిస్థలి భావివేళ మహిషు న్వేధించి సర్వామర
స్తోమత్రాసము మాన్పఁ బంపువడి మంచుంగొండపై నున్నతిన్.

50


క.

నిలిచె నటంటివి యిప్పుడు, జలజాక్షునిశక్తి మహిషుఁ జంపెను సమర
స్థలి నంటివి యీమర్మము, తెలుపుము నా కన వరాహదేవుఁడు ధరతోన్.

51