పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ యనువాక్యంబు సిద్ధ మయ్యె
నిట్టినీదృఢభక్తి యెఱుఁగక నాటికి నేటిదో యొకపాటిమాట చెప్పి
నార మింతియ కుండమంటపవిధాన, సాంగపద్ధతి దీక్ష చేయంగ లేదు
తత్ప్రకారంబు విను సావధానబుద్ధి, నెవ్వరికి నైన నుపదేశ మియ్యరాదు.

44


క.

ఒకయేఁడు జాతిశౌచా, దికములు శోధించి భక్తి దృఢ మౌట యెఱిం
గి కరుణ భూసురనృపవైశ్య, కులుల కుపదేశ మిచ్చు టర్హం బగుటన్.


సీ.

శిష్యుండు వత్సరసేవచే సంతుష్టుఁ డైనదేశికునిపాదాబ్జములకు
మ్రొక్కి నా కైహికాముష్మికసౌఖ్యప్రదాయిమంత్రముఁ గృపచేయవలయు
నని పల్క దేశికుండును నర్పడము చూచి కార్తికశుక్లపక్షమున ద్వాద
శీదినంబునను బ్రసిద్ధలగ్నంబున హరిమందిరంబులో నలికి మ్రుగ్గు
మొదలుగాఁ గలశృంగారములు రచించి, యష్టదళ మైన నవనాభ మైన షోడ
శార మైన లిఖించి తదంతరమున, విష్ణుదేవుని శాస్త్రోక్తవిధి యజించి.

46


చ.

కనుఁగవ ధౌతవస్త్రములు గట్టినశిష్యులఁ బుష్పహస్తులం
దననికటంబున న్నిలిపి ద్రవ్యము లంటినకీడుమేలునున్
గని మఱి మంత్ర మీవలయుఁ గావున నీవును నట్ల చేయు మం
చు నరుణిమౌని సూనృతవచోనిధి సత్యతపోమునీశ్వరున్.

47


క.

పలికిన నాతఁడు విహితాంజలియై గురునాథ యిమ్ము శాస్త్రోక్తవిధం
బుల నుపదేశము నాకన, ఫలకుసుమసమేతమంటపమున నరుణియున్.

48


వ.

సత్యతపోమునికి శాస్త్రోక్తప్రకారంబున శ్రీమదష్టాక్షరీమంత్రం బుపదేశించి మహా
నుభావా తొల్లియు నీవు కృతార్థుండవు విశేషించియు నిప్పుడు దీక్షామంటప
మధ్యంబున ధౌతవస్త్రపరిష్ఛన్నలోచనుండవై శుభద్రవ్యసంస్పర్శనంబు గావిం
చితివి గావునఁ దపస్సిద్ధుండవై బ్రహ్మభూయంబు నిదె పొందెదవు మన కిద్దఱకు
విష్ణుసాయుజ్యంబుఁ బొంద నిదియ మంచిసమయం బని తాను నతండును నిశ్చల
ధ్యాననిమీలితాక్షులై సాక్షాత్కరించిననారాయణుం గలసిరి యేతదుపాఖ్యానంబు
వినిన వినిపించినశుద్ధాత్ములకు గయాశ్రాద్ధఫలంబు సిద్ధించు వసుంధరా యింక
మానవులకు నిహలోకంబున రోగదారిద్య్రాదిదోషంబులు దొలఁగి సంతతారో
గ్యసంపత్తి పుత్రపౌత్రాభివృద్ధి దొరకువిధంబు చెప్పెద వినుము కార్తికశుక్ల
పక్షద్వాదశిం గాని సంక్రమణసోమసూర్యగ్రహణాదిపుణ్యకాలంబులం గాని శృం
గారితమంటపాభ్యాంతరంబున నెనిమిదిఱేకులపద్మంబు వ్రాసి యెనిమిదివిదళం
బుల నెనిమిదికలశంబుల నడుమ నొక్కకలశంబును యథావిధానంబున నిలిపి
నడిమికలశంబుమీఁద లక్ష్మీసమేతవామభాగు నారాయణుని నిలిపి షోడశోపచా