పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

దీనిపండులతేనెసోనలు గూడియో మాధవశయ్యాబ్ధి మధుర మయ్యె
నీరంధ్ర మగుదీనినీడనె పెరిఁగియో మలయజద్రుమవాటి పలుకఁ బాఱె
దళ మైనదీనియూడలు దూఱిపో నోపకో యినుఁ డపరాబ్ధిఁ గ్రుంకు నెపుడు
నుఱుతలు మొగడలు గఱవంగ దీనిపా లొరిఁగియో తెలు పయ్యె హరునిశైల
మనఁగ నాలుగుదిక్కులు ననలు గొనలుఁ, బాఱి విస్మయకర్మలఁ బ్రబలినట్టి
విపులశాఖలు గలిగినవిహరదబ్జ, భవరథమరాళవరటము భద్రవటము.

42


వ.

కదిసి విశంకటకోటరకటీరంబుల దాఁగురుమ్రుచ్చు లాడుకిన్నరకన్యకలమోహ
నంబు లగుతమకంబులు నేర్చుకొనెడుచిలుకలయెలుంగులు ప్రతిధ్వనులజాడ మొ
రయ నాడకాడకు నీడలం గుంపుగూడి పాడుగంధర్వబాలికలఁ ద్రాసులం దూఁచు
బంగారుప్రతిమలవిధంబున నూడలం బెనచినయుయ్యాలల నొయ్యెయ్యన తూఁగు
యక్షయువతుల నిజమధురాధరంబులం దత్ఫలంబులం గల్గునారుణ్యంబులతార
తమ్యంబుల నొండొరుల నడుగుఖచరకుమారికులం జూచి విస్మయపడుచు శేషవా
సుకిముఖ్యమహానాగంబుల ముళ్ళు వేసి చుట్టినం గాని దీని మొదలివలము కొలపెట్ట
రాదు త్రివిక్రమదేవుండు చక్క నిక్కి చూచినం గాని దీనికొనగొమ్మలు గానరావు
మహాతాండవంబు సలుపుకుండళికుండలుండు సాఁచిన సముద్దండబాహామండలం
బు గాని తక్కినవి దీనివిస్తృతశాఖానికాయంబులకు సరిగావు దీని ప్రతిబింబంబు
చూచి సుమీ లోకులు చందురునందు మఱ్ఱి గల దందురు దీనివిశాలపలాశంబులు
చూచె నే నాదినారాయణుండు నిరంతరంబు బాలకత్వంబు వహించి పవ్వడింప
వేడుక పడు దీనిదఁడ నధివసియించి శిష్యులకు నుపనిషద్రహస్యంబులు వక్కా
ణించుచు సంయములు దక్షిణామూర్తి ననుకరించుచున్నవారు పాతాళంబునకు
దిగినదీనిమూలంబులు దిగ్గజాలానలీల వహించుచున్నవి హిమవన్నగంబు దీనిక్రింద
నెండకన్ను నీడకన్ను నెఱుంగక నెమ్మది నున్నముక్తికన్యక విహరించుచంద్ర
కాంతపుటరుంగుతెఱంగున నున్నది గదా యని బహుభంగులం బ్రశంసించుచు
నెదుటఁ జిత్రశిలాతలంబున బ్రహ్మవర్చసం బొలుకులువాఱ నతినియతిం దపంబు
సలుపుచున్న సత్యతపునిఁ గని తాను మున్ను దేవికాతటంబున మాశకటంభకయ
యనుమంత్రం బుపదేశించిన శబరుండు తపోమహత్త్వంబునఁ గల్మషంబులఁ దొఱంగి
జీవన్ముక్తుం డగుట యెఱింగి సంతసించుచు నతనిచేత నభ్యుద్ధానప్రణామార్ఘ్యపా
ద్యగోదానాదిపూజలు వడసి కుశాసనాసీనుండై.

43


సీ.

తనశిష్యువదనంబు తప్పక వీక్షించి మామీఁదిభక్తిసంపత్తి యెపుడు
వదలక నాస్తితత్వం గురోః పర మను తెలివి నీవు దపంబు సలుప యాదృ