పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిట్లు దివికి మధాంధసు లెల్ల నేగఁ, గొంతతడవుకు బ్రహ్మ వీడ్కొలుప శిష్య
సముదయముఁ దాను గక్ష్యాంతరములు గడచి, వచ్చె సురదేశికుఁడు బహిర్ద్వారమునకు.

8


క.

ఆవేళ రైభ్యవసువసు, ధావరు లాంగిరసుచే యథాసముచితపూ
జావిధులు వడసి నందితు, లై వెంటం జనిరి దివికి నఘగిరిపవికిన్.

9


మ.

చనిన న్వారును దాను జీవుఁడు నిజాస్థానీనివాసాంతరం
బున లీలాపరికల్పితైందవశిలాభూమిన్ సుఖాసీనుఁడై
మునికంఠీరవ భూమిభృత్తిలక మమ్ముంగూర్చి మీ రేగుదెం
చినకార్యంబులు చెప్పుఁడా తెలిపి నిశ్చింతాత్ములం జేసెదన్.

10


వ.

అనవుడు.

11


క.

అమరేంద్రమంత్రితో రై, భ్యమహాముని పలికె ముదితుఁడై మోక్షము క
ర్మమునం గలదో సుజ్ఞానమునం గలదో వచింపు నావుడు గురుఁడున్.

12


క.

నలినీపత్రము సలిలం, బులఁ బొరయనిరీతి నుత్తముఁడు సత్కర్మం
బులు గానీ దుష్కర్మం, బులు గానీ హరికి నిచ్చి పొరయఁడు వానిన్.

13


గీ.

ఏతదర్థంబు గాఁగ మునీంద్ర తొల్లి, విష్టరకనామకీకటవిభునితోడ
నత్రిగోత్రసముద్భవుఁ డైనసంయ, మనుఁడు చేసినతర్కంబు వినుము నీవు.

14


మ.

ఘనుఁ డాసంయమనుండు తీర్థములు ద్రొక్కం బోవుచో ధర్మకా
ననమధ్యంబున వీచికాపవనసన్నాహంబు దేహంబు ముం
ప నిజస్వాంతము పల్లవింపఁ గనియెన్ భాగీరథిన్ నర్మరో
పనిరాసార్ధపదద్వయీవినతికృత్పాధోజభూసారథిన్.

15


మ.

కని తత్తీరవనాంతరంబునఁ గురంగశ్రేణివెంటన్ గృతాం
తునిరీతిన్ బఱతెంచువిషటురకు ధానుష్కుం గుణారోపితా
స్త్రుని రక్తాక్షుని జుంజురుందలకిరాతున్ ముందరం జూచి చే
త నివారించుచుఁ బల్కెఁ బెద్దరొద నత్యంతానుకంపాత్ముఁడై.

16


క.

ఓయి నిషాదకులేశ్వర, యేయకు మేయకుము జీవహింసకు నేలా
రోయవు చెల్లంబో నీ, కేయపకారంబు చేసె నీలే ళ్ళనినన్.

17


శా.

అవ్వాక్యంబు నిరాకరించి దిశ లల్లాడం గఠోరంబుగా
నవ్వెన్ నవ్వి నిషాదభర్త మృగసంతానంబుఁ జంపంగ నే
నెవ్వాఁడం బరమాత్మగాక పిసవెఱ్ఱీ విప్ర యీచీఁకటుల్
 ద్రవ్వింపం బనిలేదు సుమ్ము మముబోట్లన్ వీరివారిం బలెన్.

18