పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తండోలాయితఘంటికాఘణఘణధ్వానార్భటీబంధబం
ధురవాగ్గుంభవిడంబితాంబరధునీదుర్వారగర్వోర్ములై.

63


మ.

కలకాలంబును నన్నదాన మొసఁగం గాంక్షించి యామంబులో
పల నే సస్యము విత్తి పండనితపఃప్రాధాన్య మేధాన్య మి
ట్టలవోకం జదలేటినీరు మృతమాయాధేనుపై దేనివా
రల దేజీవన మంచుఁ దన్ను ఫణితిప్రౌఢిం బ్రశంసింపఁగన్.

64


సీ.

విని గౌతముండును వీరు మాయాధేను వనినకారణ మేటి దనుచు యోగ
దృష్టి విచారించి దేవదారువనాంతరాగతమునులధౌర్త్యంబు నిశ్చ
యించి చాకుండ రక్షించిన మఱవ కుండంగ బొమ్మలఁ బెట్టుభంగిఁ దమ్ముఁ
గఱవుకాలంబునఁ గాచిన న న్నెట్లుగా నిట్టిగోహత్యగానిఁ జేసి
రనుచుఁ గటమర లదరంగ నౌడు గఱచి, బొమలు ముడివడ లోచనాంతములు జేగు
రింపఁ గోపంబు చెమట వర్షింప హస్త, మున వియద్గంగ సలిలంబు పుడిసిలించి.

65


మ.

కలకాలంబుఁ గృతఘ్నులై కపటులై కైవల్యదూరాత్ములై
మలినీభూతమనస్కులై సుకృతకర్మభ్రష్టులై కష్టులై
తల లింగంబులు మేన బూడిదలు గంతల్ బొంతలుం దాల్చి శా
స్త్రుల వేదజ్ఞుల సర్వదైవతములన్ దూషించుపాషండులై.

66


క.

పోవుదురు గాక దారువ, నీవాచంయము లటంచు నిష్ఠురతరవా
చావైఖరిని శపింపం, గా వైమానికులు మునులు గౌతముతోడన్.

67


క.

భట్టారకత న్మునులకు, నట్టే కావలెఁ గృతఘ్నులై యీకరణిన్
వట్టిపెనురట్టు నీకున్, గట్టినకట్టిఁడుల కైనఁ గారుణ్యమునన్.

68


వ.

అస్మదీయప్రార్థనం బంగీకరించి భీషణభవదమోఘరోషభాషణఫలంబు కలియుగం
బున ననుభవించునట్లుగా వారల ననుగ్రహింపుము నీవు దెచ్చినది గావున నిమ్మహా
నది గౌతమీనామంబును వరదానంబున వచ్చి గోవుమీఁదఁ బ్రవహించుటం జేసి
గోదావరీనామంబును బూని రంగతరంగకోలాహలమిషంబున నీకీర్తి ఘోషించుచు
భువనపావనియై వర్తించుచు నుండు మహానుభావా మేము పోయి వచ్చెద మని
గౌతముని వీడ్కొని కైలాసంబునకు వచ్చి నాకు నుమాసమేతునకు మ్రొక్కి
దేవా మావంశంబువార లైనదేవదారువనతాపసులు గౌతమునిశాపంబుకతంబునం
గలియుగంబునఁ బాషండులు కాఁ గలరు వారలకు నాధారంబుగా నొక్కశా
స్త్రంబు గల్పింప నవధరింపు మన లక్షగ్రంథపరిమితంబును వేదసమ్మతంబు నగు
విశ్వాససంహిత గల్పించితి నేతదాధారంబునం గొందఱు దాంభికులు ధనలోభం