పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఏను నొక్కజటాఖండ మిచ్చి వత్స, యిందు నిందుకళామృతం బిందుకొన్న
తద్వియన్నది యున్నది తడయ కిపుడ, పొమ్ము నీ వన్న నమ్మునిపుంగవుండు.

58


మ.

నను భావించుచు నప్పటప్పటికి నానందాశ్రువుల్ గాఱఁగాఁ
దనలోఁ జొక్కుచు నేగి దంభగవిమీఁదన్ దజ్జటాఖండ మొ
య్యనఁ బిండన్ విమలాంబువు ల్వెడలె సంధ్యారాగసంలిప్తనూ
తనశీతాంశుకళావినిర్గతసుధాధారానుకారాకృతిన్.

59


క.

ఆనీరు సోఁకి మాయా, ధేనువు తా నిద్ర వోయి తెలిసినపగిదిన్
మేను విదిలించుకొంచును, మౌనులు వెఱఁగంది చూడ మగువ యగుతఱిన్.

60


క.

ఉదకముచేతనె కపటపు, మొదవు మడిసె మొదలు నుదకములచేన తుదిన్
బ్రదికె నుదకంబు ధరలో, నది గాన విషామృతాహ్వయంబులు దాల్చెన్.

61


వ.

అని జగజ్జనంబులు పలుక నజ్జటాఖండనిర్గతవారిపూరంబులు క్రమక్రమంబున మహా
వాహిని యై నిజావగాహంబు సలుపుదేహిసందోహంబులపాపపంకంబు లిట్ల
కడుగుదు నన్నట్లు శతశృంగనగసంగతశిలాపంకంబులు గరంచుచు స్వసమీపవా
సులమోహపాశంబు లిట్ల పెఱికి పేటాడుదు ననుపగిది నిరుదరులపొదలం బొద
లినవల్లికలం బెల్లగించుచుఁ దనవారి గ్రోలినవారిజఠరగోళంబులం గలసకలరో
గంబు లిట్ల సుడిపఱతు ననుచందంబునం గందరాంతరంబులు చొచ్చి సింహశరభ
శార్దూలాదిమృగంబుల సుడివఱచుచుఁ దన్ను దర్శించుధర్మపరులకర్మంబు లిట్ల
నిర్మూలంబు గావింతు ననుభావంబున సమున్నతద్రుమంబులు వ్రేళ్ళతోన కూలం
ద్రోచుచు మీరు గదా నిజరమణపారావారబంధనకారణంబు లనువైరంబు దలంచి
భేదించువిధంబున ధరణీధరంబులు దెగం బాఱుచుఁ దన్ను విసయంబునం గొని
యాడువైమానికులకోలాహలంబు లాలకించువడువున నిట్టలు పొడుచుచు నేనదు
లుం దనకు సరి రావని నవ్వునురువున నురువులు చూపుచు నానావర్తంబుల వడిం
బడి పరిభ్రమించునుత్తుంగకుడుంగంబులు శరనిధిం దిరుగుమందరంబునందంబు
వహింప నొక్కొక్కపట్టునం దొట్టిన పెట్టువలు విలయసలిలమధ్యంబునం దేలు
సముద్దండఘట్టితమధుకైటభనిశాటమస్తకమస్తిష్కపరంపర ననుకరింప నతిరయం
బున ననేక దేశంబులు గడచి జడవిభ్రమాలాపయుం గలితకంకణహంసకారావయు
మనోహరపులకాంకురయు వికీర్ణవేణియు విలులితమకరికయు సమున్నతోత్కలి
కయు నై సరిద్రమణసంగమోత్సవంబు గైకొనియె నప్పుడు.

62


మ.

అరరే బాపురె చాగురే బళిరె మే లాహా మఝా యంచు నం
బరమార్గంబునఁ జేరువ న్నిలిచి సప్తర్షుల్ విమానాంతరాం