పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రుద్రు నున్నిద్రనేత్రంబులన్ మిత్రునిం బంకజామిత్రునిం జూచుచున్నాఁడఁ
గన్నాఁడొకో యెవ్వఁడే నిట్టినీమూర్తి లోకత్రయవ్యాప్త రక్షస్తమిస్రావళీఘస్ర
సాహస్ర జన్మాగతబ్రహ్మవిద్యాపరీపాకజానందమే నీ వనన్ విందు ముం దబ్ధిమ
ధ్యంబునన్ నీవు మీనంబవై కావవైతే చతుర్వేదసంఘంబు తాఁబేలవై తేలవైతే
మహాశైలమున్ మోచియున్ లీలఁ గోలమ్మవై చిమ్మవైతే వడిన్ మీఁదికిం గల్పవా
రాశిమజ్జన్మహీమండలంబున్ నృసింహుండవై చెండవైతే సముద్దండదైతేయునిం
బొట్టివై మెట్టవైతే బలిన్ రేణుకాదేవికిం బట్టివై పుట్టవైతే మహాపట్టభద్రేశులన్
గొట్టివైవన్ రఘుక్ష్మాపవంశంబులో దిట్టవై కట్టవైతే దరుల్ ముట్టఁ బెన్నీటి రామాభి
ధేయుండవై యుండవైతే సదా రేవతీతుంగవక్షోజపీఠంబుపై బోడపై చూడవైతే
పురాధ్యక్షరక్షోవధూశీలభంగంబులన్ మావవై కావవైతే జగం బుద్ధత మ్లేచ్ఛులం
జంపి దేవా భవత్ప్రాభవం బాభవాంభోజగర్భాదు లంతంబుగా నెన్నలే రన్న
నే నెంతవాఁడం బ్రశంసింప నాభక్తి గైకొమ్ము ముక్తిం గృపాయుక్తిమై నిమ్మటం
చున్ బ్రణామంబు గావించినన్ బద్మనాభుండు నే మెచ్చితి న్మౌనినాథా వరం
బిచ్చెదన్ వేఁడు మన్నన్.

110


సీ.

ఇందిరాధిప నాకు నింక నొక్కవిచిత్రరూపవిలాసంబు చూపు మనిన
తాపసోత్తమ నన్నుఁ దప్పక యించుకవడిఁ జూడు మన మౌనివరుఁడు నట్ల
చూడంగ నద్దేవచూడావతంసంబువిశ్రుతాననమున వెడలె నీరు
తజ్జలంబులు భూతధాత్రి యంతయుఁ గ్రోల నేకోదకం బయ్యె నింతలోనె
దహన ముదయించి క్రోలెఁ దద్బహుళజలము, ననిలము జనించి తద్వహ్ని నాఱవిసరె
పవనము నడించి పెనుబట్ట బయలు దోఁచెఁ, దన్నభంబున నొక్కశబ్దంబు వొడమె.

111


క.

పరతత్త్వరాజుముందట, మొరయునకీబులవిధాన మ్రోయుచు నుండెన్
ధరణి సలిలానలానిల, భరవిరహితశుద్ధశూన్యభావమె నిలువన్.

112


గీ.

కటకటా సృష్టి చీఁకట్లు గవిసె నింది, రాధవుఁడు సైతమును గానరాకపోయె
ననుచు బ్రహ్మాండభాండమధ్యమున బ్రమసి, తిరిగి నారదముని మొగ తిరిగె నపుడు.

113


క.

వినవచ్చె శబ్దము రవం, బున విసరె మరుత్తు గాడుపున వెలిఁగె హుతా
శన మనలంబునఁ బ్రవహిం, చె నీరు సలిలమున నొక్కచెలువ జనించెన్.

114


వ.

కుంభినీధరకుచకుంభయుగళయు రత్నాకరమేఖలయు దూర్వాశ్యామలయు నగు
నత్తామరకంటి తొంటియట్ల దిశామండలంబు నిండె మఱియు మెరయుశబ్దంబు
వలన సితకృష్ణవర్ణ లిద్దఱుముద్దియలు వెడలిరి వెండియు మెండుకొనుశబ్దంబువలన
శరదబ్దరుచిస్ఫూర్తియు సప్తమూర్తియు నగుపురుషుండు సంభవించె నప్పటి