పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నావుడు నట్ల కాక జననాయక యేఁ జనుదేర నిమ్మహా
మ్రావనిజంబు కుబ్జతరమై కనుపట్టుట నింతనుండి యి
ప్పావనతీర్థరాజము ప్రభావము చూపుచుఁ గుబ్జకామ్రముం
ధావధమున్ వహించుఁ బ్రథితంబుగ విశ్వవసుంధరాస్థలిన్.

48


గీ.

ఇచట జంతులలోపల నెద్ది యైనఁ, బెద్దనిద్రకు మ్రాఁగన్ను వెట్టెనేని
దాని కబ్బు విమానశతంబు గొలువ, బ్రహ్మయోగీంద్రలోకసామ్రాజ్యపదము.

49


క.

అని పలికి శౌరి శంఖం, బున దేహము దిగ్గ విడిచి పోవుటయు ఫలం
దనునకు నప్పుడె మోక్షం, బొనఁగూడె మహామునీంద్రు లోహో యనఁగన్.

50


క.

ప్రఖ్యాతకుబ్జకామ్రో, పాఖ్యాన మినోదయమునఁ బఠియింప వినన్
ముఖ్యంబు లైనయిహపర, సౌఖ్యంబులు గలుగు నెట్టిజనులకు నైనన్.

51


వ.

కావున మహానుభావుం డగునద్దేవు నీవును భజియింపు మనశ్వరభద్రంబులు గలుగు
భద్రాశ్వనరేశ్వరా యింక ధన్యవ్రతంబు వినుము మార్గశీర్షాదిమాసచతుష్టయంబున
నుభయపక్షంబులం బాడ్యమినాఁటిరాత్రి రాత్రించరారాతి నారాధించి వైశ్వా
నరాయ నమో యని పాదంబులు నగ్నయే నమో యని యుదరంబును హవిర్భుజే
నమో యని వక్షంబును ద్రవిణదాయ నమో యని భుజంబులు సంవర్తాయ నమో
యని శిరంబును జ్వలనాయ నమో యని సర్వావయవంబులుం బూజించి తద్దేవు
నగ్రభాగంబున నిర్మించినకుండంబున నేతన్నామంబులన హోమంబు చేసి ఘృత
యుక్తం బైనయవభక్తంబున నక్తంబులు సలుపవలయుఁ జైత్రాదిమాసచతుష్షయం
బున నట్ల పూజాహోమాదులు సలిపి సఘృతపాయసంబున నక్తంబు సలుపవలయు
శ్రావణాదిమాసచతుష్టయంబున సక్తున నక్తంబు సలుపవలయు వ్రతసమాప్తిసమ
యంబున యథాశక్తి హాటకంబునం జేసినకృపీటయోనిప్రతిమ వస్త్రద్వయం
బునం బొదిగి రక్తపుష్పానులేపనంబులం బూజించి సలక్షణమనోహరాంగుం
డగువిప్రపుంగవు రక్తవస్త్రయుగపుష్పానులేపనాదుల శృంగారించి ధన్యోస
యనుమంత్రంబున దానం బిచ్చినధన్యునకు దుష్కర్మంబు లడంగి పుష్కల
ధనధాన్యాదిసమృద్ధులు సిద్ధించు నేతద్వ్రతాచరణంబున మున్ను నారదునకు
శూద్రత్వంబు మానె నీకథ వినిన చదివినవారలు ధన్యు లగుదురు మహీకాంత
యింకఁ గాంతివ్రతంబు వినుము.

52


సీ.

కార్తికశుక్లపక్షద్వితీయారాత్రి బలకేశవుల మంటపమున నిలిపి
బలదేవుపేరిటఁ బాదపద్మంబులు శౌరినామంబున జానువులుఁ బ్ర
లంబఘ్ననామధేయంబునఁ గటియుఁ గేశినిషూదనాహ్వయంబున నురంబు
కంఠభాగంబు సంకర్షణాఖ్య మహాభుజస్తంభములు శార్ఙ్గిసంజ్ఞ శిరము