పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కేశవాహ్వ శరీరప్రదేశ మెల్ల, వాసుదేవాభిధానాన వరుసతోడ
నంగములఁ బూజ చేసి తదగ్రసీమ, రజతనిర్మితవైష్ణవప్రతిమ నిలిపి.

53


మ.

ప్రసవాద్యంబులచే నమో స్త్వమృతరూపా యంచుఁ బూజించి వే
దసమర్థుం డగువిప్రపుంగవునకుం దానంబుగా నిచ్చి గం
ధసమేతంబుగ నర్ఘ్య మిచ్చి యవభక్తంబున్ ఘృతవ్యక్తమున్
వసుధానిర్జరు లారగింప వ్రతియై నక్తంబు చేయం దగున్.

54


సీ.

కడమమాసము లిట్ల కావించి ఫాల్గునాదికమాసములు నెన్మిదింట నర్చ
నార్ఘ్యపాద్యాదికృత్యములు నిర్వర్తించి నక్తంబు పాయసాన్నమున జరపి
యవలహోమము కార్తికాదికంబుల రాజనములహోమము ఫాల్గునప్రభృతుల
సతిలాన్నహోమ మాషాఢముఖ్యంబుల సల్పుచు నొక్కవత్సరము నిండ
వెండిసోముని నిర్మించి వెల్లవస్త్ర, యుగళమునఁ జుట్టి చంద్రఖండోపమాను
లేపనాదుల ధాత్రీనిలింపవిభుని, భూషితునిఁ జేసి నియమితభాషణముల.

55


వ.

కాంతిమానస్మిన్ లోకేస్మి న్ననుమంత్రంబున దానం బొసంగుసువ్రతుండు కాంతి
మంతుం డగు దక్షశాపంబున రాజయక్ష్మపరిక్షీణగాత్రుం డగునత్రిపుత్రుండు ము
న్నీమహావ్రతంబు సలిపి కదా గదాధరునికరుణావిశేషంబున నమృతకళ వడసి
సోమత్వంబునం బొంది శర్వరీసమయంబుల వెలుంగుచు సర్వౌషధిసార్వభౌమత
వహించె నిట్టిసోమునికళ విదియనాఁ డాస్వాదించునాశ్వినేయులు ముఖ్యపక్షం
బున విష్ణువిఖ్యాతి వహింపుదురు వార యేల యీలోకంబున విష్ణువిరహితం బైన
దైవతంబు లేదు మేదినీశ్వరా యింక మగవారలకు మగువలకు సకలసౌభాగ్యం
బులు నొసంగుపరమసౌభాగ్యవ్రతంబు వినుము.

56


క.

వెడఁగుఁదనంబున నీళ్ళ, న్నడు మడఁచిన రెండు గానినలువున బలిభి
న్మృడు లెందు వేఱు గారని, విడువనివేలంబు చాటు వేదాంతంబుల్.

57


సీ.

కలశపారావారకన్యకామణి నాఁగఁ గమ్మదమ్మి వసించుగట్టుపట్టి
వడఁకుగుబ్బలిరాచవారికుమారి నా సింగంబు నెక్కెడుసింధుతనయ
ఱెక్కలబొల్లని నెక్కువే ల్పన శేషశయ్యపైఁ బవళించుచంద్రధరుఁడు
బుడుతవెన్నెలపూవు ముడుచుదేవుఁ డనంగ వాతాశనాహితవాహుఁ డిట్లు
గా వనెడివారివేదముల్ గారువేద, ములు మతంబు లసమ్మతంబులు పురాణ
ములును గాథాపురాణముల్ దలఁపఁ గృతులు, వికృతులని గేలిగొందురు విమలమతులు.

58


సీ.

అటు గాన నీరహస్య మెఱింగి ఫాల్గునప్రభృతిమాసోభయపక్షములఁ ద
దియనాఁ డుపవసించి నియమంబుతో నుమాహరుల నైనను రమాహరుల నైన