పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అశుభధ్వంసక మిందుకుం దగునుపాఖ్యానంబు నేఁ జెప్పెదన్
విశదీభూతము గాఁగ రేయిఁ బగ లుర్వీముఖ్యభూతావళుల్
దిశ లద్రుల్ జలధుల్ దినేశవిధులున్ లేకుండుకాలంబునన్
బశుపాలుం డనురాజు దాఁ బశువులన్ బ్రఖ్యాతిఁ బాలింపుచున్.

8


క.

వేడుక నొకనాఁ డంబుధి, చూడం జని కుపితహరికిశోరచపేటా
మ్రేడితకరిఘీంకార, వ్రీడితసంవర్తఘనము వేలావనమున్.

9


సీ.

విస్మయం బంది ప్రవేశించుచోఁ గొన్నిపాముల నెనిమిదిపాదపముల
నొకమహానదిఁ దిర్యగూర్ధ్వప్రచారుల నేగురుపురుషుల నినసహస్ర
దేదీప్యమానంబు ద్రిప్రకారము త్రివర్ణాధారయుక్తంబు నధికతరవి
శాలంబు నైనవక్షముతోడిచపలాక్షి నొకతెను జూచుచు నొంటిఁ దిరుగు
చుండ నివి యిన్నియును భీతి నొక్కటై వి, నాశమునఁ బొందె నంత నానరవరుండు
దొంగలకుఁ జిక్కి తింక నేభంగి నాకు, విడుద లౌ నని చింతించువేళ నెదుట.

10


క.

ఎక్కడ వోయెద వింకం, జిక్కితి గా కనుచుఁ గృష్ణసితరక్తతనుం
డొక్కఁ డెదిరె వానివలన, నొక్కఁడు మహదాహ్వయమున నుదయమునొందెన్.

11


క.

వారిద్దఱు నారమణిని, రా రమ్మని సన్న చేసి రయమున ముగురుం
జేరి పశుపాలు నొక్కనిఁ, గ్రూరతఁ బైకొనిరి మఱియుఁ గొందఱు పురుషుల్.

12


చ.

వడి నరికట్టుకొన్న జనవల్లభుఁ డంబుదపఙ్క్తు చేతిలోఁ
బడినహిమాంశుమండలముభంగిఁ దిరోహితుఁ డయ్యెఁ జోరు ల
ప్పుడు బెడిదంపుఁ గైదువులు పూని పరస్పరలీను లైనచోఁ
బొడమె నృపాలుగేహము నభోమణికోటివిభాసమాన మై.

13


మ.

మఱియుం గోటులసంఖ్యలై ధవళసద్మంబుల్ విచిత్రంబుగా
నెఱి చూపె న్మరుదంబువహ్నివియదన్వీతంబు లాయిండ్లలో
మెఱుఁగుంబోఁడి వసించె నోర్తు బహుకుంభీబింబితార్కాకృతిన్
నఱకెం దద్గృహమస్తకంబులు మహీనాథుండు శీఘ్రంబునన్.

14


క.

ఆపశుపాలనృపాలుభు, జాపాటవమును సమీకజయము మజ బళీ
బా పని త్రివర్ణపురుషుం, డాపోవక పొగడె సవినయాలాపములన్.

15


క.

వెఱపింపఁ బోయి వెఱచిన, తెఱఁగున నే మేమ చిక్కితిమి నీచే నిం
దఱమును బరమేశ్వర యి, త్తఱి నీదేహమున నుండెదము పుత్రులమై.

16


వ.

అనినఁ బశుపాలనృపాలుండు కృపాళుండై కర్ణామృతంబు లైనవచనంబులఁ దత్త్రి
వర్ణపురుషు నాదరించి వత్సా భవత్సాహాయ్యంబునం గదా నిర్లేపుండ నగుట