పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెగుటకుం బొడముటకు నిలుచుటకు నీవ కర్తవై వర్తింపు మని నియోగించి నిజాత్మ
జత్వంబును బ్రసాదించి వారిలో వారిలోనితామరపాకుచందంబున నేమిటం
బొరయక తిరుగుచుండె నంతటఁ ద్రివర్ణపురుషుండు మహత్తను పేరిటివానిఁ దన
వంటిపట్టి నొకనిం బుట్టించె నతనివలన బోధస్వరూపిణి యైనకన్యక జన్మించె
నాలలనవలన విజ్ఞాననిగమం బైనమనంబు జనించె నమ్మనంబువలన నతిసౌమ్యు
లేవురు పురుషులు సంభవించిరి వారివలన నక్షాభిధాను లుద్భవించిరి వీర లిద్దఱు
మున్ను పశుపాలు నాక్రమించినచోరులు తారు నిరాకారు లైన బహుద్వారంబు
నేకస్తంభాధారంబును జతుష్పదోదారంబును నదీసహస్రవిహారంబు ననేకజల
కూపాలంకారంబు నగుపురంబుం బ్రవేశించి యొకస్వరూపం బగుటయుఁ దత్క్షణంబ
పశుపాలుండు మూర్తిమంతుండై పురంబు ప్రవేశించి సూక్తవాక్యంబు లైనవేదం
బులు సంస్మరించి తదుక్తవ్రతాదికృత్యంబు లాచరించి కర్మకాండంబు నడపి జడి
సినకతంబున.

17


క.

అలయికతో నిద్రకుఁ బడి, తలలు భుజాస్తంభములుఁ బదంబులు వేదం
బులు నాలుగేసి కలమె, చ్చులబంగారంబువంటిసుతునిం గనియెన్.

18


క.

అది మొద లాపశుపాలుఁడు| మదవత్కరివరశిరస్సమారూఢుండై
యుదధివనతృణాదికములఁ, జెదరక విహరించెఁ బశువశీకరలీలన్.

19


ఉ.

భద్రాశ్వక్షితిపాల చెప్పితి భవత్ప్రశ్నానురూపంబుగా
రుద్రాంభోరుహగర్భముఖ్యులకు వాక్రువ్వంగ రా కద్బుతో
న్నిద్రం బైనమహేతిహాస మిదియే నీయందు నాయందు స
ర్వద్రవ్యంబులయందు నొక్కసరియై వర్తించు నూహించినన్.

20


సీ.

విను మింక సంభూతవివరంబు పశుపాలువలనఁ బుట్టినచతుర్వక్త్రుఁ డఖిల
వేదశాస్త్రగురుండు వెడలెఁ దత్తనువున స్వరనామధేయుండు సప్తమూర్తి
పూరుషార్థములు తత్ప్రోక్తంబు లందులో మొదటిది నాల్గుకొమ్ములవృషభము
రెండవ దర్థ మాదండది కామ మీమూడును లయ మైన మోక్ష మనఁగఁ
బరఁగె నాసప్తతనునిప్రభావ మెఱుఁగఁ, దలఁపు గలవారు వర్తింపవలయు వరుస
బ్రహ్మచారిత్వమున ధర్మపరత భృత్య, భరణమున సోహమస్మి యన్ భావమునను.

21


వ.

మఱియు నాచతుర్ముఖుండు నిజాపత్యంబు లైననిత్యానిత్యస్వరూపంబుల సప్తస్వ
రంబులం జూచి పితృపుత్రపుత్రుండు పితామహనామధేయుం డగు నని వేదంబులు
చెప్పు నిప్పుడు మాతండ్రిమాహాత్మ్యగుణంబులలోన నొక్కటియు మత్తనూజుల
వలనం గానరాదు నాదురంతచింత వాయునుపాయంబు లే దని తమతండ్రిం