పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆనందబాష్పములు గనుఁ, గోనల దిగజాఱ నూలుకొనుపులకలతో
మేను గనుపట్ట హాసం, బాననమున మొనపఁ బాత్ర లాడుచు నున్నన్.

94


క.

ఆకలకలంబు విని ధా, త్రీకాంతుఁడు వచ్చి తాను దేవియు వినతుం
డై కుంభజ యీహర్షం, బేకారణమున జనించె నెఱిఁగింపు దయన్.

95


క.

అనవుడు భద్రాశ్వునిఁ బే, ర్కొని భూవర నీవు నీ పురోహితులు వధూ
జనములు నకటకటా నా, మనము దెలియ లేక మూఢమతు లైతిరిగా.

96


సీ.

నావుడు దండప్రణామంబు చేసి భద్రాశ్వుఁ డగస్త్యమహామునీంద్ర
దేవరపలుకులు దెలియ మాకు వశంబె కృపతోడ నానతి యి మ్మటన్న
నరనాథ పూర్వజనమున నీదేవి యీభామ వైనిశనామపట్టణమున
హరిదత్తుఁ డనుపేరఁ బరఁగుకోమటియింటివరవుడు శూద్రాన్వవాయమున జ
నించి దానికి విటుఁడవై నీవు నట్టి, సంజ్ఞ నావైశ్యునకుఁ బరిచర్య చేసి
తిరుగుదువు సెట్టియు మురారిచరణకమల, యుగళనిశ్చలభక్తిసంయుతుఁడు గాన.

97


వ.

ఆశ్వయుజశుద్ధద్వాదశీదివసంబునఁ బద్మనాభవ్రతంబు సలుపుచు విష్ణుదేవాలయం
బునకుం జని మహోత్సవంబు గావించి దాసీదాసు లైనమిమ్మిద్దఱ దీపమాలికలకుం
గావలి పెట్టి మరలి యింటికిం బోవుటయు దీపమాలిక లతిప్రయత్నమునఁ గాచిన
పుణ్యంబునఁ బ్రియవ్రతవసుంధరాధిపతికిం బుట్టి పట్టాభిషిక్తుండ వైతివి నాఁడు
నీకుం బ్రేయసి యైనదాసియు నిక్కాంతిమతియై జనించె భద్రాశ్వనరేశ్వర పర
కీయదీపజ్వాలనఫలంబున నిట్టి సామ్రాజ్యంబు సిద్ధించె నిజద్రవ్యంబు వెచ్చపఱచి
లక్ష్మీపతికి దీపంబులు సమర్పించినవారిభాగ్యంబు చెప్ప నెట్టివారికిని వశంబు
గాదు గావున శ్రీహరిం బ్రశంసించితి బాల్యంబున నందనవనంబునం దపంబు చేసి
వాసుదేవప్రసాదంబున నసాధారణపదంబు వడసెం గావున ధ్రువు నుపశ్లోకించితి
రాక్షసవంశంబున సంభవించి యొండెఱుంగక పుండరీకాక్షుం గొలిచి నిలిచెం
గావునఁ బ్రహ్లాదు వర్ణించితి భర్తకుఁ దాత్పర్యంబునం బరిచర్య నడపి తత్పరో
క్షంబునఁ గౌస్తుభవక్షు నారాధించి మోక్షంబు గనుం గావున వనిత వినుతించితి
నిన్ను సంస్తుతించుతెఱంగు మున్న చెప్పితి వెన్నుండు ప్రసన్నుండుగా జన్మం
బులు నివర్తింప సామర్థ్యంబు గలదు గావున రాజుల విప్రుల వైశ్యులం గొనియాడితి
బ్రాహణశుశ్రూషలు మొదల వదలక వారిముదల నారాయణభక్తియుక్తుం డైన
మాత్రంబున ముక్తివరారోహ వరియించుఁ గావున శూద్రుం బొగడితి మధుమథన
చరణకమలమధుకరాయమానమానసుండనై మెలంగుదు గావున నన్ను బహూక
రించుకొంటి నని వెండియు.

98