పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలం
బునఁ దామ్రవైణవదారవంబులలోన దొరకినపీఠంబుమీఁద వస్త్రద్వయవేష్టితంబు
లైన యథాశక్తి కనకనిర్మిత రామలక్ష్మణప్రతిమలం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు
సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమా
దానంబు గావించి తదనంతరంబున నుర్వరాసుపర్వులకుఁ బాయసాహారంబు సదక్షి
ణంబుగా నొసంగి భృత్యసంగతుండై భుజియించిన శాశ్వతైశ్వర్యధుర్యుండై పవి
త్రచరిత్రులం బుత్రులం బడసి పిదప నాచతుర్దశమహేంద్రంబు నిసర్గస్వర్గభోగం
బు లనుభవించి మర్త్యంబున జన్మించి సార్వభౌమత్వంబు వహించు నిమ్మహావ్ర
తంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

46


మ.

మును సంతానము గోరి పఙ్క్తిరథరాణ్ముఖ్యుండు నానానిలిం
పనుతుం డైనవసిష్ఠుఁ డీవ్రతము చెప్పన్ భక్తిఁ గావించి స
జ్జనతాధీనుల దుష్టదానవభిదాసంధానులన్ మానులన్
గనియెన్ సూనుల రామచంద్రుఁడు మొదల్గా నల్వురన్ సంయమీ.

47


మ.

ఇనుఁ డాఖండలదిక్కునం బొడముచో నీరెండ గాయంగ వి
చ్చునవాంభోరుహముల్' మదాళికరణిన్ జుంబించె నందన్మరం
దనదీతుందిలకుంజపుంజములలోనం గుంకుమోద్వర్తనం
బున దీపించినగోపికాజనముఖంబుల్ శార్ఙ్గి శ్రీకృష్ణుఁడై.

48


గీ.

అట్టికృష్ణునకుఁ బ్రియంబుగా నాషాఢ, శుద్ధదశమి నాఁడు సుజనవరుఁడు
పూర్వభంగి నియమములు దీర్చి యేకాద, శీదినమునఁ బావనోదకముల.

49


వ.

స్నానాదికృత్యంబులు జరపి యదభ్రవిభ్రమసందర్భం బైనమంటపగర్భంబున
రాత్రి వైకుంఠనాయకు నారాధించి వాసుదేవాయ నమో యని పాదంబులు సం
కర్షణాయ నమో యని కటీరంబును బ్రద్యుమ్నాయ నమో యని జఠరంబును నని
రుద్ధాయనమో యని యుదరంబును జక్రపాణాయే నమో యని భుజంబులు భూ
పతయే నమో యని కంఠంబును పురుషాయ నమో యని శిరంబును శంఖాయ నమో
యని శంఖంబును జక్రాయ నమో యని చక్రంబును బూజించి తద్దేవతాగ్రభాగం
బున సరత్నసలిలపూర్ణకుంభంబు నిలిపి తదుపరిస్థలంబునం దామ్రవైణవదారవం
బులలోన దొరకినపీఠంబుమీఁద వస్త్రయుగచ్ఛన్నంబును యథాశక్తి హాటకనిర్మి
తంబును సంకర్షణప్రద్యుమ్నానిరుద్ధసహితంబును నైనవాసుదేవప్రతిమం బ్రతి