పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

స్నానాదికృత్యంబులు జరపి వైభవాభిరామం బైనమంటపసీమంబున రాత్రి ము
కుందు నారాధించి వామనాయ నమో యని పాదంబులు విష్ణవే నమో యని కటీ
రంబును వాసుదేవాయ నమో యని జఠరంబును సంపూర్ణకామాయ నమో యని
యురంబును విశ్వసృజే నమో యని కంఠంబును విశ్వరూపిణే నమో యని శిరంబును
విశ్వజితే నమో యని భుజంబులును శంఖాయ నమో యని శంఖంబును జక్రాయ
నమో యని చక్రంబును బూజించి తద్దేవతాగ్రభాగంబున సరత్నసలిలపూర్ణకుం
భంబు నిలిపి తదుపరిస్థలంబునం దామ్రదారువైణవంబులలోన దొరకినపీఠంబు
మీఁద యజ్ఞోపవీతకమండలుపాదుకాతపత్రబ్రుసీసమేతం బైన యథాశక్తికాంచనవిని
ర్మితవామనప్రతిమం బ్రతిష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి
మఱునాఁడు సూర్యోదయావసరంబునఁ గలశప్రతిమాదానంబులు చేసి తదనంత
రంబ ధరామరపుంగవులకుఁ బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృత్య
సహితుండై భుజియించినఁ బుత్రపౌత్రాభివృద్ధి గాంచి నిఖిలసుఖంబు లనుభవించి
బ్రహ్మకల్పపర్యంతంబు వైకుంఠంబున నుండి పిదప మధ్యమలోకంబునఁ జక్రవర్తి
యై పుట్టు నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

37


మ.

యతివంశోత్తమ పూర్వకాలమున హర్యశ్వాహ్వయుం డైనభూ
పతి పుత్రార్థము గానలోఁ దపము సల్ప న్మెచ్చి విప్రాకృతిన్
శతపత్రాక్షుఁడు వచ్చి చైత్రసితపక్షద్వాదశిన్ వామన
వ్రతముం జేయుము నీకుఁ గల్గును గుమారప్రాప్తి రాజాగ్రణీ.

38


గీ.

అనిన వీటికి నేగి హర్యశ్వుఁ డిమ్మ, హావ్రతము చేయ నదితికి నసురవైరి
పోలె నుగ్రాశ్వుఁ డనురాజు పుట్టి చక్ర, వర్తియై తాల్చె వివిధభూవలయభరము.

39


మ.

అనవద్యుండు హరుండు దాఁ గఱప నభ్యాసంబు గావించువే
ళ నిరాయాసత మత్తఖండిఁ దునుకల్ గా దొడ్డరోకంటఁ గొ
ట్టినలీలన్ భయదాజిరంగమునఁ గొట్టెం గండ్రగొడ్డంటివా
త నిలింపారివిదారి హైహయభుజస్తంభావళుల్ రాముఁడై.

40


గీ.

ఆపరశురామునకు హృదయప్రియంబు, గాఁగ వైశాఖశుక్లపక్షమున దశమి
సముచితాచారములు పూర్వసరణి నరుఁడు, చేసి కడునిష్ఠ నేకాదశీదినమున.

41


వ.

స్నానాదికృత్యంబులు సలిపి సారఘనసారసారంగమదపరిమళధారాళం బైన
మంటపాంతరాళంబున రాత్రి శతపత్రనేత్రు నారాధించి జామదగ్న్యాయ నమో
యని పాదంబులు సర్వధారిణే నమో యని యుదరంబును క్షత్రాంతకాయ నమో
యని భుజంబులు మణికంఠాయ నమో యని కంఠంబును శంఖాయ నమో యని