పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ముందట నొక్కమహీజము, క్రింద హరిణచర్మములు ధరించినమునిరా
ణ్ణందనులం గనుఁగొని మృగ, సందేహంబున నిశాతశరముల నేసెన్.

23


క.

ఏసిన హరిహరి యనుచు గ, తాసువులై కూలుటయు మహాశ్చర్యము సం
త్రాసంబును ముప్పిరిగొన, నాసంయమిసుతులకడకు నరిగి విభుండున్.

24


క.

అసదృశపాపఫలంబున, నసి వోవనిబ్రహ్మహత్య లైదు దగిలె నె
ట్లు సహించువాఁడ మృగయా, వ్యసనము కొఱగామి గాన వచ్చె నటంచున్.

25


సీ.

పోయి చేరువ నున్నపుణ్యాశ్రమస్థలంబున నున్నదేవరాతునకు మ్రొక్కి
తనకు నిష్కారణంబున బ్రహ్మహత్యలు దగులుట చెప్పి గద్గదికతోడ
నేడ్చిన నాసంయమీశ్వరుఁ డూరార్చి రాజన్య మున్ను వారాశిలోన
మునిఁగినభూమికామిని నుద్ధరించినకరణి మహాపాతకంబువలన
శ్రీవధూజాని ని న్నుద్ధరింపఁ గలఁడు, తలఁక నేల వరాహవ్రతంబు సలుపు
మనిన నాతండు చని వరాహవ్రతంబు, సలిపి శుద్ధాత్ముఁడై జగజ్జనులు వొగడ.

26


శా.

దృప్తారాతివరూధినీరుధిరమత్తీభూతభూతస్తుతి
వ్యాప్తానేకరణస్థలీవిజయబాహాగాంధవాహాసియై
సప్తాంభోనిధిమేఖలావలయితక్ష్మామండలం బెల్ల సం
తృప్తిం బొంది దిగంతరాళములఁ గీర్తిస్ఫూర్తి వర్తింపఁగన్.

27


సీ.

ఆనరేంద్రుండు దేహావసానంబున మణిమయం బైనవిమాన మెక్కి
నాకంబునకుఁ బోవఁ బాకశాసనుఁ డర్ఘ్య మీవలె నని యెదు రేగుదేరఁ
గనుఁగొని విష్ణుకింకరులు నివారించి వీరసేనావనిదార యితఁడు
తపమున నీకంటెఁ దక్కువ గానఁ జూడక రమ్ము నావుడు సకలదిగధి
పాలకులదివ్యతేజఃప్రభావమును ని, రాకరించి వివర్జితప్రళయమునకు
సత్యలోకంబునకుఁ జని సౌఖ్యలీల, నిపుడు సైతము నున్నాఁడు ఋషివరేణ్య.

28


మ.

ధర గంపింప మహాసభాభవనరత్నస్తంభసంభూతుఁడై
కరజంబు ల్నులివెట్టి రక్తకణముల్ గారంగ వీక్షించి రౌ
దరసద్రోణికలో యటంచు విబుధవ్రాతంబు వర్ణింప శ్రీ
హరి రక్షోభుజమధ్యమండలము చెండాడెన్ నృసింహాకృతిన్.

29


గీ.

ఆనృసింహునకుఁ బ్రియంబుగా ఫాల్గుణ, శుద్ధదశమినాఁడు సువ్రతుండు
విహితవిధులు పూర్వవిధమునఁ దీర్చి యేకాదశీదినమునఁ గ్రమముతోడ.

30


వ.

స్నానాదికృత్యంబులు జరపి రంగవల్లికాప్రముఖశృంగారకళాసాన్నిధ్యం బైన
మంటపమధ్యంబున రాత్రి మధుకైటభారాతి నారాధించి నారసింహాయ నమో