పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సత్యతపోనామధేయంబు వహింపుము వేదశాస్త్రపురాణేతిహాసబ్రహ్మవిద్యావిశార
ద్యంబు నీకుం గలుగ వరం బిచ్చితి ననిన సాష్టాంగదండప్రణామంబు లాచరించి
మునీంద్రా కిరాతుండ నైన నేను వేదాదివిద్యలకు నర్హుండ నగుట యెట్లు డెందం
బున నున్నసందేహంబు మాన్పు మని విన్నవించిన.

109


సీ.

అనసూయపట్టి యి ట్లనియె నోయిసుధీనిధాన చెప్పెదఁ బురాతనకిరాత
దేహంబు గాదు నిరాహారతపము సేయఁగ శరీరాంతరం బయ్యె ననిన
ఋషికులేశ్వర నాకు రెండువిగ్రహము లేగతిఁ గల్గె నావుడు నతఁడు సత్య
తపునితో జంతుసంతతికి నధర్మరూపంబును ధర్మరూపంబు నుభయ
రూపమును నైనతనువు లార్యులు వచింపు, దురు వరుస మూడటంచు నందుల నధర్మ
ధర్మభోగానుభూతికిఁ దగినమేను, పారలౌకిక మనియెడుపేరు దాల్చు.

110


క.

విశదముగా విను తేజః, కృశానుసమ యాతనాశరీరంబును భో
గశరీరంబును గై, వల్యశరీరము ననఁగఁ ద్రివిధ మగుఁ దత్తనువుల్.

111


గీ.

నీవు గురుసంస్మరణతపోనియమపరతఁ, జేసి ధర్మంపుమేను దాల్చితివి సుమ్ము
సర్వకాలంబు జీవహింసకునిధాన, మైనతొల్లింటిపాపంపుమేను మాని.

112


సీ.

అటుగాన వేదశాస్త్రాదిసమస్తవిద్యలకు నర్హత్వంబు గలదు నీకు
సంశయింపకు మానసంబున మానవుం డెందాఁక వర్తించు నెనిమిదింట
నందాఁక నతఁడు గర్మానుబంధంబులఁ బొరలు నష్టకవర్గమునను బాసి
త్రిగతుఁడై సంతతస్థిరతఁ బ్రాపించిన నాల్గేనులు వర్తించి యేకమార్గ
నిరతుఁడై కాంచు బ్రహ్మంబు నిక్క మనిన, సంయమీశ్వర యిట్టి సుజ్ఞానమహిమ
యెఱుఁగ నేరనివారికి నెట్లు గలుగు, బహుసుఖైకాస్పదము పరబ్రహ్మపదము.

113


వ.

అనవుడు దూర్వాసుండు సత్యతపు నిరీక్షించి నిర్మలాత్మా యింక నొక్కమర్మం
బాకర్ణింపుము సుజ్ఞానంబునం గాని సత్కర్మంబు జరగదు సత్కర్మంబునం గాని
విజ్ఞానంబు వొడమదు వివేకింప నీరెండు నొండొంటికి సాధనంబులు సత్కరం
బులు బ్రహ్మక్షత్రవైశ్యశూద్రవర్ణంబుల యజనపాలనకృష్యాదివృత్తిశుశ్రూషాభేదం
బులఁ జతుర్విధం బయ్యె బ్రహ్మక్షత్రియవైశ్యులు వేదోక్తప్రకారంబున నిజాచా
రంబుల నడపవలయు వీరికి శూద్రుండు సేవ చేయవలయు నీతెఱంగునఁ గులధర్మం
బు దప్పక బ్రహ్మోపాసకు లైనజనులు మోక్షంబునం బొందుదురు బ్రహ్మం బ
రూపనామధేయం బప్రమేయం బని దురవగాహంబుగా నూహింపకు బ్రహ్మం బనం
గ భక్తరక్షాపరాయణుం డైన నారాయణుండు తద్దేవుండు యజ్ఞాదికృత్యంబుల