పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వి నిరీక్షించుచు భావికార్యము మనోవీథిన్ వితర్కించి యి
ట్లనియెన్ బూర్వదిగీశ్వరప్రముఖసర్వామర్త్యవర్గంబుతోన్.

136


సీ.

సురలార జగదధీశ్వరి గాన నీదేవి ననుసరించి హిమాగమునకుఁ బొండు
భవ భవత్కృతమహాస్తవపాఠకులకు నీశక్తియు నీవు నైశ్వర్య మిండు
దుర్గ మీఁదట గర్వదుర్వారుఁడై పుట్టు మహిషాసురునిఁ జంపి మనుపు మిమ్ము
బ్రహ్మ చనిన గాయత్రి నిర్జరపరంపర గొల్వ నీహారధరణిధరము
చేరి మందారసంతానపారిజాత, కల్పహరిచందనావృతాగ్రస్థలంబు
తానకముగా వసించి తద్దైవతముల, నందితులఁ జేసి తాల్చె నందాసమాఖ్య.

137


వ.

ఇట్లు మహామాయచేతఁ జేతఃప్రమోదంబు నొంది పురందరాదిబృందారకులు మంది
రంబులకుం బోయిరి నరేంద్రా నందజన్మదివసంబు నవమిగావున నాఁడు కథ విని
పిష్టాహారు లైనవారికి నభీష్టార్థంబులు సిద్ధించు నని ప్రజాపాలునకు మహాతపోమునీ
శ్వరుండు చెప్పె నని వరాహదేవుడు వినిపించిన వసుంధరాపురంధ్రి తరువాతి
వృత్తాంతం బానతిమ్మని విన్నవించిన.

138


మ.

కృతనారాయణపాదపూజన జనక్షేమక్రియాభోగ భో
గతిరస్కారితపాకశాసన సనక్షత్రక్షపానాయక
ప్రతిబింబశ్రుతిమౌక్తికస్తబకరారాజత్ప్రసన్నాస్య నా
స్యతినైపుణ్యవిరోధిరాజపరిరక్షాదక్షబాహార్గళా.

139


క.

బుధవినుత సాళ్వనరసిం, గధరాధవదండనాథ కాంతాపంచా
యుధ సుమనస్తరుసుమనో, మధురసమధురిమధురీణమంజులఫణితీ.

140


పృథ్వీ.

దయాభరణ లోభిరాట్తనయవారతన్వీవిటా
నయాచరణ గీయమానబిరుదప్రతాపోద్భటా
జయానకమృదంగజర్ఝరహుడుక్కికాఝల్లరీ
భయానకరవార్భటీపటపటద్దశాశాతటా.

141

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబున షష్ఠాశ్వాసము.