పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వాసవుఁ గొట్టిన వహ్నిఁ గూడె శచీశ్వరాగ్నుల మోఁదిన యమునికడకు
వచ్చిరి హరిశిఖివైవస్వతుల జయించిన దైత్యుఁ గలిసిరి జిష్ణుకీలి
శమనక్షపాటులఁ జఱచిన వరుణుఁ జేరిరి యింద్రబర్హిఃపరేతపాస్ర
పప్రచేతసుల విభాళించిన సమీరు డాసిరి దేవరాడ్దహనదండి
యాతుపాశిమరుత్తుల గాతిగొనిన, ధనదుఁ జెందిరి కుధరభేద్యనలకాల
రాక్షసాంభోధివరజగత్ప్రాణయక్ష, పాలకుల వెంటఁబట్టిన శూలిఁ గనిరి.

130


ఉ.

దిక్ప్రభు లెల్ల నిట్టిపగిదిన్ భయకంపితగాత్రులై మన
శ్శుక్ప్రతికారచింతకు యశోవతి యుంట యెఱింగి రాహవి
ర్భుక్ప్రతిమానరోషమునఁ బొంగుచు వేత్రనిశాచరుండు వా
ర్ముక్ప్రకరార్భటిన్ బటహముల్ మొరయన్ జనుదేర నత్తఱిన్.

131


క.

ఆశాధినాథులును వా, గీశానునిలోకమునకు నేగి నిజమనః
క్లేశంబు గానఁబడ నా, క్రోశించిరి సలిలనిధులు ఘూర్ణిల్లంగన్.

132


సీ.

ఆదిక్పతులమొఱ లాలించి విష్ణుపాదమునఁ బుట్టినసలిలములలోన
క్షేత్రజ్ఞ మాయ గాయత్రి జపించుచు నుండియుఁ గమలాసనుండు సదయుఁ
డై నిరీక్షించి మాయావినిర్మితులు గారా సురాసురు లంచు నాతఁ దలఁప
నావిర్భవించె శార్ఙ్గాసిగదాశంఖచక్రపాశాంబకచాపహస్త
నిర్మలాంబర మత్తకంఠీరవాధి, రూఢశక్తి జనించి మరుచ్చమూప
రంపరలు చూడఁ బెక్కువర్షములు పోరి, వేత్రనక్తంచరుని మెడ విఱిచివైవ.

133


ఉ.

ఆర్చి బలారిముఖ్యులు నిశాటపతిప్రళయానలంబు చ
ల్లార్చినసింహవాహనకు నాదిమశక్తికి లోకదుర్దశల్
దీర్చినవేదమాతృకకు దేవికి హస్తసరోరుహాంజలుల్
చేర్చిరి ఫాలభాగమునఁ జేయఁ దొడంగె శివుండు సంస్తుతుల్.

134


సీ.

గాయత్రి మూఁడువక్త్రములశూలిని బ్రహ్మమది నుద్భవించినమంత్రశక్తి
దనుజఘ్ని మూఁడుతత్త్వంబుల మొలచినగౌరి వేదంబులఁ గన్నతల్లి
వాణి చంద్రార్కపావకనేత్ర మూఁ డక్షరముల నిల్చినశంకరప్రభూత
శబరి సుధారసస్రావిణి మూఁడులోకంబులు నిండినకమలనిలయ
దేవి స్వాహాస్వధాత్మిక దివ్యభూష, ణాంబరప్రసవాలేపనాభిరామ
భక్తవరద మహామాయ పరమమునివ, రేణ్యసంసేవ్య నిన్ను వర్ణింప వశమె.

135


మ.

అని యీశానుఁడు సంస్తుతించుతఱి దైత్యారాతిపాదోద్భవాం
బునిమగ్నుండు విరించి వెల్వడి బహిర్భూమిం బ్రకాశించుదే