పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అతివిశదప్రభావిలసనాస్పద మైనసదాంగుళీనఖ
ప్రతతి వెలుంగు నాహిమధరాధరపుత్రికిఁ బద్మనేత్రకున్
గతజననంబునం దనకు గాదిలిసోదరి గాన భక్తితో
సతతముఁ గొల్వ దక్షతనుజాతలు తారలు వచ్చెనో యనన్.

9


క.

అంబుజభవాదివిబుధ గ, ణంబులదొడ్డతన మెల్ల నాకు వెనుక త
థ్యం బని చూపె ననంగా, బింబాధర దొడ్డతనము పిఱుఁదునఁ దాల్చెన్.

10


క.

ఆకన్యారత్నంబు ని, రాకారుం డైనశివుని హత్తినతనమా
యాకళచందము దోపఁగ, నాకాశమువంటినడుము నారు వహించెన్.

11


క.

కాఠిన్యము దోరంతరపీఠిం బూర్ణంబు లైనపృథుకుచముల నా
పాఠీననయన దాల్చెఁ, దాఠేవం దండ్రిగుణము దాల్చినభంగిన్.

12


గీ.

ఆసతి ధరించె శక్తిత్రయప్రభావ, భావములతోడ విహరించుపరమశక్తి
నే ననుచుఁ దెల్పుగతి మోవి నీక్షణముల, నెఱులు నరుణిమ ధవళిమ నీలిమయును.

13


క.

ఈరీతి గోత్రకుధరా, గారంబున శైశవంబు గడపి క్రమమునం
దారుణ్యము గైకొని జగ, దారాధ్య మృగేంద్రమధ్య హైమవతి మదిన్.

14


క.

కనకధరాధరచాపుఁడు, తనపతి గావలె నటంచుఁ దలపోసి మహా
వనమునకుఁ జనియె జననీ, జనకులయనుమతిఁ దపంబు సలిపెడుకొఱకున్.

15


సీ.

చని పూగపున్నాగసాలరసాలాదిసాలరమ్యప్రదేశముల నిలిచి
కందక పాటలగంధి గావునఁ దీవ్రతాధురామోఘనిదాఘవేళ
కొంకక క్రొమ్మెఱుఁగుఁబోఁడి గావున జాతనిర్ఘాతజీమూతవేళ
వందక శీతాంశువదన గావున దీర్ఘయామినీఘోరనీహారవేళఁ
దపము గావింప వెడలె వత్సరసహస్ర, ములు మహాదేవుఁ డంత నాభూమిధరకు
మారి గౌరి ననుగ్రహింపంగఁ దలఁచి, తొంటి తనలాంఛనంబులు తొలఁగఁబెట్టి.

16


సీ.

అనవరతస్నానమునఁ జేసి కలయ నంతట వండువట్టినతల వడంక
సారెకు నుష్ణించి నీరు గ్రమ్మైడునేత్రములమీఁద నరసినబొమలు వ్రాలఁ
గడుపెద్దయెముకలు గానంగ వచ్చుఱొమున దొడ్డజన్నిదంబులు చలింప
త్రోళ్ళు వ్రేలాడెడుతుంటిపై బ్రహ్మకమ్ములచింపిదోవతి ముఱికి వలవ
ముసలిబ్రాహ్మణుఁడై వేదములు చదువుచు, నలసి నిలుచుచుఁ దా నడుగడుగునకును
దడఁబడిపడుచుఁ బార్వతి దాయ వచ్చి, యీరెలుంగున దీవించి యిట్టు లనియె.

17


శా.

శ్రీశైలంబున సేతుబంధమునఁ గాంచిం గుంభకోణంబునన్
గాశిన్ మందరఁ గాళహస్తి నిఁక లెక్క ల్వెట్టఁగా నేల నా