పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

రాజశేఖరచరిత్రము


సీ.

ఏవీథిఁ జూచిన నిందుబింబాననా
                       లాలితలాస్య కోలాహలంబు
లేవాడఁ జూచిన నితరేతరాలాప
                       సమ్మర్దబధిరితాశాముఖంబు
లేచాయఁ జూచిన లోచనోత్సవకర
                       ప్రత్యగ్రమౌక్తికరంగవల్లు
లేచక్కిఁ జూచిన నిద్ధపుణ్యాంగనా
                       కల్పితకళ్యాణగానఫణితు


గీ.

లెచటఁ జూచిన నవరత్ననిచయరచిత
వివిధతోరణమాలికావిలసనంబు
లెందుఁ జూచిన జగదభినందితాచ్ఛ
బహువితానంబు లప్పురి బరిఢవిల్లె.

155


క.

చనుదెంచు పౌరయాత్రిక
జనులకు బర్ణానిలంబు చలువల కనఁగా
మునువాకిళ్ళలు బెట్టిరి
కనకమయోదగ్రకదళికాస్తంభములన్.

156


గీ.

అపుడు శుద్ధాంతమున కేగి యవనివిభుఁడు
శుభముహూర్తంబు నేఁడు మెచ్చులవరుండు
గలిగె మనకాంతిమతి భాగ్యగౌరవమున
నేల యాలస్య మింక పూర్ణేందువదన.

157


క.

సైరంద్రులఁ బిలిపించి కు
మారికఁ గైసేయ బంపుమా యన నద్దే
వేరియు భూపతియనుమతి
వారి నియోగింప నధికవైభవ మొదవన్.

158


సీ.

అంగనామణికిని సంపంగినూనియ
                       శిర సంటె నొక్కరాజీవగంధి
పువ్వుఁబోఁడికి గోళ్ల దువ్వి గంధామల
                       కము వెట్టె నొక్కసైకతనితంబ