పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

89


కలకంఠికిఁ గమ్మపన్నీట మ
                       జ్జన మార్చె నొక్కవిశాలనేత్ర
యలినీలవేణికి వెలిపట్టుపావడఁ
                       దడియొత్తె నొక్కవేదండగమన


గీ.

మానవతి కోర్తు చెంగావిమడుగు గట్టె
గురుపయోధర కోర్తు క్రొవ్విరులు దుఱిమెఁ
గీరభాషిణి కోర్తు కస్తూరి యలఁదెఁ
జంద్రముఖి కోర్తు రత్నభూషణము లిడియె.

159


క.

ఆనలిననేత్ర యప్పుడు
నానావిధరత్నభూషణచ్ఛవిలోనన్
గానంగఁబడియెఁ గింశుక
సూనాంతరభాసమానశుకియో యనఁగన్.

160


శా.

ఆరీతిన్ సఖు లొయ్యఁదేర వసుధాధ్యక్షుండు తా నక్కుమా
రీరత్నం బతిమానమానసధృఢప్రీతిన్ విలోకించి పై
పై రోమాంచము లంగకంచుకము లై ప్రాపింపఁ బెల్లుబ్బె జం
భారాతిప్రథమానవైభవకళాహంకారసంక్రాంతుఁడై.

161


గీ.

అధికసంభ్రమయుక్తిఁ గళ్యాణవేది
కై కుమారికఁ దెమ్మని యచటి కడుపు
రాజశేఖర మేదినీరమణవరుని
రా నియోగింప వైభవప్రాభవముల.

162


సీ.

తమరుఢమామికాతమ్మటకాహళ
                       పటహభేరీమహార్భటులు మెఱయ
సకలపుణ్యాంగనాజనసమర్పితలాజ
                       జాలంబు నక్షత్రసమితిఁ దెగడ
భూపాలవర్గంబు త్రోపుత్రో పాడుచు
                       గిరికొని రెండుపక్కియలు నడువ