పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

87


చెప్పినట్టులు వచ్చునే సితమయూఖ
యేల త్రుళ్ళెద విది యేమి మేలు నీకు.

149


ఉ.

రాహువు గాను ని న్నఱగరాచిన శూరుఁడఁ గాను నీతను
ద్రోహము చేసినట్టి యలరోహిణితండ్రిని గాను దజ్జగ
న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మఁ గూర్ప క
య్యో హరిణాంక తావకమయూకముఖంబుల నేచ నేటికిన్.

150


వ.

అని యిత్తెఱంగునఁ జిత్తంబున నెత్తిన తత్తరంబునం దరంబుగాని విరహ
భరంబు భరియింపఁజాలక పొరలునంత.

151


గీ.

రతిపశరవర్షనాశనక్రమము దెలుప
మొనసి దీపించు నల యింద్రధను వనంగఁ
బ్రాచి యుమిచిన తాంబూలరస మనంగ
నుదయరాగంబు మెల్లన నుప్పతిల్లె.

152


గీ.

తనదుమనుమని పెండ్లి కెంతయును వేడ్క
నఖిలదిగ్నాగపతుల ర మ్మనుచు శోభ
నాక్షతంబులు వెట్టిన యట్టికరణి
గమలబాంధవదీప్తి నల్గడల మెఱసె.

153


సీ.

అటు ప్రభాతంబైన నావంచకాధీశు
                       తనయుండు కాలకృత్యములు దీర్చి
వసియింప నట సింధువసుధేశుఁడును మంత్రి
                       హితపురోహితుల సమ్మతి వహించి
యాహైమధ్వనికి నాత్మతనూజాతఁ
                       గాంతిమతీకన్యకాలలామఁ
గళ్యాణ మొనరింపఁ గౌతుకోనిద్రమా
                       నసుఁడై దిగంతభూనాథతతికిఁ


గీ.

బ్రీతి శుభలేఖ లనిచి రప్పించి మిగుల
మంచిలగ్నంబుగా నిశ్చయించి పుర మ
లంకరింపంగ నియమించె లవణవార్ధి
వేష్టితాశేషమహిజను ల్వెఱఁగు పడఁగ.

154